ధాన్యం కొనుగోలు లక్ష్యం పెంచాలి | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోలు లక్ష్యం పెంచాలి

May 11 2025 12:28 PM | Updated on May 15 2025 4:27 PM

భీమవరం: ప్రభుత్వం లక్ష్యం పెంచి దాళ్వా ధాన్యం కొనుగోలు చేయాలని, నూక శాతం పేరుతో మిల్లర్ల దోపిడీని అరికట్టాలని ఏపీ కౌలు రైతుల సంఘం డిమాండ్‌ చేసింది. శనివారం సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి మామిడిశెట్టి రామాంజనేయులు ధాన్యం పట్టుబడులను పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. పూర్తిస్థాయిలో ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతు సేవా కేంద్రాల ద్వా రా వెళ్లిన ధాన్యాన్ని టార్గెట్‌ పూర్తయిందంటూ మిల్లర్లు దింపుకోవడం లేదని రైతులు తమ దృష్టికి తీసుకువచ్చారన్నారు. కొందరు మిల్లర్లు ఎంటీయూ 1156 రకం కొనుగోలు చేయడం లేదని, కొనుగోలు చేసినా 75 కిలోల బస్తాకు అదనంగా రెండు నుంచి నాలుగు కిలోలు తీసుకుంటున్నారన్నారు. అధికారులు ఆయా సమస్యలను పరిష్కరించాలని కోరారు.

12 నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు

భీమవరం: ఇంటర్మీడియెడ్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 12న ప్రారంభం కానున్నాయని జిల్లా ఇంటర్మీడియెట్‌ విద్యాశాఖాఽధికారి ఎ.నాగేశ్వరరావు శనివారం విలేకరులకు తెలిపారు. జిల్లాలోని 40 కేంద్రాల్లో 18,265 మంది విద్యార్థులు హాజరుకానున్నారన్నారు. ఫస్టియర్‌ జనరల్‌ కేటగిరీలో 13,494, ఒకేషనల్‌ కేటగిరీలో 1,020, సెకండియర్‌ జనరల్‌ కేటగిరీలో 3,201, ఒకేషనల్‌ కేటగిరీలో 550 మంది విద్యార్థులు హాజరవుతారని పేర్కొన్నారు. ఫస్టియర్‌ పరీక్షలు ఉద యం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెకండియర్‌ పరీక్షలు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతాయన్నారు. రెండు ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌, రెండు సిట్టింగ్‌ స్క్వాడ్స్‌, 13 స్టోరేజ్‌ పాయింట్లు ఏర్పాటు చేసినట్టు నాగేశ్వరరావు చెప్పారు. పరీక్షలు సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరుగుతాయన్నారు.

జూలై 5న లోక్‌ అదాలత్‌

నరసాపురం: జూలై 5న జరిగే జాతీయ లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయాలని నరసాపురం 10వ అదనపు జిల్లా జడ్జి ఎ.వాసంతి అన్నారు. ఈ నెల 10న జరగాల్సిన జాతీయ లోక్‌అదాలత్‌ ను జూలై 5కు వాయిదా వేశామన్నారు. కార్యక్రమం నిర్వహణకు మరో రెండు నెలల సమ యం వచ్చినందున ఈసారి మరిన్ని ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా న్యాయవాదులు, పోలీసులు ప్రయత్నించాలని సూచించారు. కక్షిదారులకు అవగాహన కల్పించి, లోక్‌ అదాలత్‌లో కేసులు రాజీ చేసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించాలని తెలిపారు.

యుద్ధ పరిస్థితులపై అవగాహన తప్పనిసరి

భీమవరం: యుద్ధాన్ని ఎవరు కోరుకోవడం లేదని తప్పనిసరి పరిస్థితిలో, అనివార్యమైతే సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తగిన అవగాహనతో పౌరులంతా సిద్ధంగా ఉండాలని కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి అన్నారు. మినిస్టరీ ఆఫ్‌ సివిల్‌ డిఫెన్స్‌ ఇన్‌ ఇండియా రూపొందించిన సమాచారాన్ని క్రోడీకరించి జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ శాఖ తయారుచేసిన ‘యుద్ధం మాకు వద్దు.. అనివార్యమైతే ఎదుర్కొనేందుకు మేం సిద్ధం’ అనే పుస్తకాన్ని శనివారం క్యాంపు కార్యాలయంలో ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ యుద్ధం అనివార్యమైతే త్రివిధ దళాలతో పాటు పౌరులు కూడా సైనికులుగా మారాల్సి ఉంటుందన్నారు. శిక్షణ లేకున్నా అవగాహన ద్వారా యుద్ధ సమయంలో పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి వీలవుతుందనే లక్ష్యంతో ఈ పుస్తకాన్ని రూపొందించినట్టు చెప్పారు. ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి, జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ శాఖ అధికారి ఆర్‌.కుమరేశ్వరన్‌ పాల్గొన్నారు.

యుద్ధ పరిస్థితులపై అవగాహన తప్పనిసరి1
1/3

యుద్ధ పరిస్థితులపై అవగాహన తప్పనిసరి

ధాన్యం కొనుగోలు లక్ష్యం పెంచాలి 2
2/3

ధాన్యం కొనుగోలు లక్ష్యం పెంచాలి

జూలై 5న లోక్‌ అదాలత్‌3
3/3

జూలై 5న లోక్‌ అదాలత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement