
రైతులను సర్వనాశనం చేస్తున్న కూటమి
తణుకు అర్బన్: పంట దిగుబడి అధికంగా వచ్చిందన్న ఆనందాన్ని ఆవిరి చేసేలా గోనె సంచుల కొర త సృష్టించి కూటమి ప్రభుత్వం రైతులను నిట్టనిలువునా ముంచేసిందని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు విమర్శించారు. తణుకులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేవలం గోనె సంచులు సరఫరా చేయకపోవడం వల్లే రైతులు పండించిన ధాన్యం నీటిపాలైందని మండిపడ్డారు. సాక్షాత్తూ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ధాన్యం కొనుగోలు చేయలేమన్నారంటే.. ఈ కూటమి ప్రభుత్వంలో రైతులు ఎంత దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నారో అర్థమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోపక్క ధాన్యం మొత్తం కొనుగోలు చేయకుండా టార్గెట్ పూర్తయిందంటూ కొనుగోళ్లు నిలిపివేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ముందుచూపుతో పంటను ఆన్లైన్లో నమోదు చేయించేవారని, బీమా చేయించేవారని, చివరి గింజ వరకూ ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేసేవారని, ఏ పంట నష్టానికి ఆ సీజన్లో పరిహా రం అందించారని గుర్తుచేశారు. ఇప్పుడు అన్నిరకా లుగా రైతులను సర్వనాశనం చేసే పరిస్థితి రాష్ట్రంలో దాపురించిందని ఆందోళన వ్యక్తం చేశారు. గ తంలో పీడీఎస్ బియ్యం రవాణాపై నిఘా పెట్టి లారీలను సీజ్ చేస్తూ కఠినంగా వ్యవహరించే పరిస్థితులు ఉండేవని, అయితే నేడు కూటమి ప్రభుత్వ నేతలు మట్టి, ఇసుక, పీడీఎస్ బియ్యం వంటి అంశాలను ఆర్థిక వనరుగా మార్చుకున్నారని విమర్శించారు. తణుకులో పేకాటలు యథేచ్ఛగా జరుగుతున్నాయని, పోలీసులు, పేకాటరాయుళ్లు పేకముక్కల్లా కలిసిపోయారని ధ్వజమెత్తారు. మద్యం దుకాణాల తీరును రానున్న రోజుల్లో ఎండగడతామని, నిబంధనల ప్రకారం దుకాణాలు నడవకపోతే ఉద్యమం చేస్తామని కారుమూరి హెచ్చరించారు.
యథేచ్ఛగా పర్మిట్ రూములు, బెల్టుషాపులు
రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల వద్ద పర్మిట్ రూమ్లు, బెల్టు షాపులు యథేచ్ఛగా నడుస్తున్నాయని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ సభ్యుడు వెలగల సాయిబాబారెడ్డి విమర్శించారు. ముఖ్యంగా తణుకులో ప్రతి మద్యం దుకాణం వద్ద పర్మిట్ రూమ్ నడుస్తోందని చెప్పారు. ఈ విషయంపై తణుకు ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ సీఐ సత్తి మణికంఠరెడ్డిని సమాచార హక్కు చట్టం ప్రకారం అడిగితే తణుకు స్టేషన్ పరిధిలో 33 మద్యం దుకాణాలు ఉన్నాయని, ఇటీవల కాలంలో నమో దు చేసిన కేసుల వివరాలు తెలిపారని వివరించారు. రానున్న రోజుల్లో మద్యం దుకాణాల వద్ద ఉన్న పర్మిట్ రూమ్లను సందర్శించి చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మారిశెట్టి శేషగిరి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పొట్ల సురేష్, పబ్లిసిటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు జల్లూరి జగదీష్, పట్టణ మహిళాధ్యక్షురాలు నూకల కనకదుర్గ, బెజ్జవరపు హేమశ్రీ తదితరులు పాల్గొన్నారు.
సంచుల కొరత.. టార్గెట్ల పేరుతో ఆంక్షలు
మాజీ మంత్రి కారుమూరి విమర్శలు