
కల్యాణోత్సవానికి భారీ ఏర్పాట్లు
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ముఖ్య ఘట్టం తిరుకల్యాణోత్సవాన్ని ఆదివారం రాత్రి వైభవంగా నిర్వహించేందుకు అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ తూర్పు రాజగోపురం వద్ద భారీ వేదికను నిర్మిస్తున్నారు. ఆలయ ఈఓ ఎన్వీ సత్యనారాయణమూర్తి పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి. కల్యాణ మండప ప్రాంతం, క్షేత్ర పరిసరాలను సుందరీకరించారు. స్వామివారు ఆలయం నుంచి తూర్పు రాజగోపురం మీదుగా కల్యాణ వేదిక వద్దకు రాత్రి 7.30 గంటల సమయంలో చేరుకుంటారు. అలాగే సోమవారం రాత్రి చినవెంకన్న రథోత్సవం నిర్వహించనున్నారు.