
నేటి నుంచి మీసాల వెంకన్న బ్రహ్మోత్సవాలు
కై కలూరు: కై కలూరులో శ్రీ భూసమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో స్వామికి బొడ్డులో కత్తి, ముఖంపై మొనతేలిన మీసాలు ఉండటం ఓ వింత. అందుకే స్వామిని మీసాల వెంకన్నగా పిలుస్తారు. పౌరుషానికి ప్రతీకగా వెలిసిన స్వామివారి దేవాలయం అత్యంత పురాతనమైనది. ఈ నెల 10 నుంచి 12 వరకు స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. త్రయోహ్నిక దీక్షతో వైఖానస ఆగమోక్తం పద్ధతిలో స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. శ్రీనివాసుల లక్ష్మీ ప్రవీణ్, బృందావనం లక్ష్మీ నృసింహచార్యులు, అగ్రిహోత్నం మిథునాచార్యులు, బృందావనం గోపీ కృష్ణమాచార్యులు బ్రహ్మత్సోవాల క్రతువును చేపడతారు. ఈ నెల 10న స్వామి, అమ్మవారిని పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెను చేస్తార. మాడ వీధుల్లో గజవాహనంపై స్వామి ఊరేగింపు జరుగుతుంది. 11న మాడ వీధుల్లో శేష వాహనంపై ఊరేగింపు, రాత్రి 7 గంటలకు భూ సమేత శ్రీ వేంకటేశ్వరుని దివ్య కల్యాణం, 12న స్వామివారి గ్రామోత్సవం జరగనుంది. బ్రహ్మోత్సవాలు మూడు రోజులు కై కలూరు శ్రీమన్నారాయణగోష్టి సీహెచ్.హేమలత బృందంతో విష్ణు సహస్రనామ పారాయణం జరుగుతుంది.
11న స్వామివారి కల్యాణం
ఏర్పాట్లు పూర్తి చేసిన దేవదాయ శాఖ