
కుట్టు మెషీన్ల పంపిణీలో అవినీతి
యలమంచిలి: మహిళలకు కుట్టుమెషీన్ల పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం రూ.245 కోట్ల అవినీతికి పాల్పడుతోందని వైఎస్సార్సీపీ పాలకొల్లు నియోజకవర్గ ఇన్చార్జి గుడాల శ్రీహరి గోపాలరావు (గోపి) ఆరోపించారు. ఈ మేరకు గు రువారం పార్టీ నాయకులతో కలిసి పాలకొల్లు డిప్యూటీ తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. అనంతరం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మా ట్లాడుతూ బహిరంగ మార్కెట్లో కుట్టుమెషీన్ ధర రూ.4,300, శిక్షణకు రూ.3 వేలు మొత్తం రూ.7,300 ఖర్చవుతుండగా, ప్రభుత్వం ఒక్కో లబ్ధిదారుడి నిమిత్తం రూ.23,000 చొప్పున కాంట్రాక్టర్కు చెల్లిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఇలా రూ.245 కోట్లు కొట్టేసే పనిలో ఉందని ఆరోపించారు. అవినీతిలో అధికారు లు, నాయకులు, కాంట్రాక్టర్ల పాత్ర ఉందని, విచారణ చేయాలని డిమాండ్ చేశారు. సీనియర్ నాయకులు యడ్ల తాతాజీ, పార్టీ పాలకొల్లు పట్టణ, యలమంచిలి, పోడూరు మండలాల కన్వీనర్లు కోరాడ శ్రీనివాసరావు, ఉచ్చుల స్టాలిన్బాబు, కొర్రపాటి వీరాస్వామి, యలమంచిలి ఎంపీపీ గొల్లపల్లి శ్రీనివాసరావు, నాయకులు వినుకొండ రవి, రావూరి బుజ్జి, మద్దా చంద్రకళ, శంకరపు శ్రీను, దేవ రాజేష్, గుడాల సురేష్, రావి నాగేశ్వరరావు, పెదపాటి పెద్దిరాజు తదితరులు ఉన్నారు.
తలసేమియా సేవలు విస్తృతం
భీమవరం అర్బన్: జిల్లాలో తలసేమియా సేవలను విస్తృతం చేస్తున్నామని కలెక్టర్, ఐఆర్ సీఎస్ అధ్యక్షురాలు సీహెచ్ నాగరాణి అన్నా రు. రాయలం గ్రామంలో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ జిల్లా శాఖ భవనంలో ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా గురువారం ఆరు పడకల డేకేర్ సెంటర్ను ఆమె ప్రారంభించామన్నారు. ఉచిత సేవలకు చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ఎం.మౌనిక ముందుకు రావడం అభినందనీయమన్నారు. అనంతరం రక్తదానం చేసిన యూఎన్ఓ ఫీడ్స్ కంపెనీ సిబ్బందికి సర్టిఫికెట్లు అందించారు. తలసేమి యా సెంటర్కు రూ.లక్ష చొప్పున విరాళం ఇ చ్చిన తిరుపతిరాజు, కె.రాధాకృష్ణమూర్తిలను కలెక్టర్ సన్మానించారు. జేసీ టి.రాహుల్కుమార్రెడ్డి, రెడ్క్రాస్ సొసైటీ జిల్లా శాఖ చైర్మన్ ఎంఎస్వీ శివ రామభద్రిరాజు, వైస్ చైర్మన్ కె.కనకరాజు తదితరులు పాల్గొన్నారు.
ఆక్వాలో సాంకేతికతతో
అధిక ఉత్పత్తి
ఉండి: ఆక్వాకు మారు పేరుగా పశ్చిమగోదావరి జిల్లా నిలిచిందని జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్రెడ్డి లన్నారు. మూడు రోజులుగా ఎన్నార్పీ అగ్రహారం మత్స్య పరిశోధనా కేంద్రంలో ఆ క్వాలో సాంకేతిక తదితర అంశాలపై జరుగుతున్న అవగాహన, శిక్షణ కార్యక్రమం గురువా రం ముగిసింది. ముఖ్య అతిథిగా జేసీ మట్లాడుతూ ఆక్వాలో సాంకేతిక పరిజ్ఞానం, రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఆక్వా లో ఆధునిక సాంకేతిక పద్ధతుల వినియోగంతో అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. ఆక్వా సాగులో మెలకువలు నేర్చుకుని ఉత్తమ ఫలితాలు సాధించవచ్చన్నారు. జిల్లాలో 1.33 లక్షల ఎకరాలకు గాను 49 వేల ఎకరాలు మా త్రమే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని అన్నారు. రైతులు సాగులో నూతన పద్ధతులు తెలుసుకునేందుకు నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు (హైదరాబాద్) సహకారంతో అవగాహ న కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. అ నంతరం ఆక్వా రైతులకు సర్టిఫికెట్లు అందజే శారు. జిల్లా మత్స్యశాఖాధికారి నాగలింగాచారి, డైరెక్టర్ ఫిషరీస్ అభిషేక్, ఫిషరీస్ యూనివర్సిటీ ఓఎస్డీ డాక్టర్ సుగుణ, ఎంపెడా ఫీల్డ్ అధికారి దుర్గారావు పాల్గొన్నారు.
సీపెట్ కోర్సులకు దరఖాస్తులు
నూజివీడు: విజయవాడలోని సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో డిప్లొమా కోర్సుల ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు డైరెక్టర్ అండ్ హెడ్ సీహెచ్ శేఖర్ గురువారం ప్రకటనలో తెలిపారు. పదో తరగతి విద్యార్హతతో మూడేళ్ల వ్యవధి గల డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ టెక్నాలజీ (డీపీటీ), డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ మౌల్డ్ టెక్నాలజీ (డీపీఎంటీ), బీఎస్సీ అర్హతతో మూడేళ్ల కాలపరిమితి గల పీజీ డిప్లొమా ఇన్ ప్లాస్టింగ్ ప్రాసెస్సింగ్ అండ్ టెస్టింగ్ కోర్సుల్లో చేరవచ్చని పేర్కొన్నా రు. సీపెట్ వెబ్సైట్లో ఈనెల 29లోపు దర ఖాస్తు చేసుకోవాలని సూచించారు.

కుట్టు మెషీన్ల పంపిణీలో అవినీతి