
నిరుద్యోగ భృతి.. భ్రాంతి
యువతను ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అనుసంధానం చేస్తామన్నారు.. పరిశ్రమలు తెచ్చి ఉద్యోగాలిస్తామన్నారు.. ఉద్యోగం వచ్చే వరకూ నెలకు రూ.3 వేల నిరుద్యోగభృతి ఇచ్చే బాధ్యత తాము తీసుకుంటామని చంద్రబాబు, పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదైనా నిరుద్యోగభృతి హామీపై నోరుమెదపకపోవడం యువతను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.
శురకవారం శ్రీ 6 శ్రీ జూన్ శ్రీ 2025
సాక్షి, భీమవరం: జిల్లాలో దాదాపు ఎనిమిది ఇంజినీరింగ్ కళాశాలలు, 55 వరకు డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. పాలిటెక్నిక్, వృత్తివిద్య కోర్సులు కళాశాలలు 20కు పైగా ఉన్నాయి. వేలాది మంది విద్యార్థులు వీటిలో విద్యాభ్యాసం సాగిస్తున్నారు. ఇప్పటికే డిగ్రీ, ఇంజినీరింగ్ పూర్తిచేసి డీఎస్సీ, గ్రూపు పరీక్షలు, పోలీస్ రిక్రూట్మెంట్, ఏపీపీఎస్సీ తదితర వాటి ద్వారా ప్రభుత్వ కొలువుల కోసం జిల్లాలోని భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, నరసాపురం, పాలకొల్లు పట్టణాల్లోని కోచింగ్ సెంటర్లు, ఇంటి వద్ద ప్రిపేర్ అవుతున్న వారు వేలల్లో ఉంటారు. జిల్లా నుంచి ఇతర విశాఖ, విజయవాడ, హైదరాబాద్ తదితర నగరాల్లో ఉంటూ ఎంతోమంది పోటీ పరీక్షల కోసం శిక్షణ పొందుతున్నారు. వీరంతా శిక్షణ ఇచ్చే సంస్థలకు వేలు, లక్షల్లో ఫీజులు చెల్లిస్తున్నారు. తమ బిడ్డల భవిష్యత్తు కోసం అయినకాడికి అప్పులు చేసి శిక్షణ ఇప్పిస్తున్న తల్లిదండ్రులు ఎందరో. హాస్టల్, మెస్ నిమిత్తం నెలకు రూ.6 వేలకు పైనే ఖర్చవుతుంది. మరోపక్క డిగ్రీ, ఇంజినీరింగ్, ఇతర పై చదువులు చదువుకుని కుటుంబ ఆర్థిక పరిస్థితులతో చాలీచాలనీ జీతంపై వివిధ వ్యాపార, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. వీరిలో తమ చదువుకు తగిన ఉద్యోగం కోసం వేచి చూస్తున్నవారు చాలామంది ఉన్నారు.
భృతిపై గంపెడాసలు : ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన ఉద్యోగాల కల్పన, అంతవరకు ప్రతి నెలా ఇస్తామన్న భృతి హామీల అమలుకు జిల్లాలోని 5.17 లక్షల కుటుంబాలు గంపెడాసతో ఎదురుచూస్తున్నాయి. ఏపీపీఎస్సీ ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు 42 ఏళ్లు, రిజర్వు కేటగిరీ అభ్యర్థులకు ఐదేళ్లు అదనపు వెసులుబాటు ఉంటుంది. ఈ మేరకు ఇంటర్ నుంచి 47 ఏళ్ల వయసు పరిగణనలోకి తీసుకుని భృతి అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిరుద్యోగులు కోరుతున్నారు. రూ.3 వేలు తమకు ఎంతో ఆసరా అవుతాయని వారంటున్నారు.
ఉన్న వాటికీ కొర్రీ
కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న వాటిని తొలగించే పనిలో కూటమి ప్రభుత్వం ఉంది. ఎన్నికల ముందు వలంటీర్ల జీతం రూ.10 వేలు చేస్తామని చెప్పి వారిని విధుల్లోకి తీసుకోకుండా పక్కన పెట్టేసి జిల్లాలో 8,616 మంది వలంటీర్లను సేవలకు దూ రం చేసింది. కూటమి నేతలకు మద్యం షాపులు కట్టబెట్టేందుకు ప్రైవేట్ మద్యం పాలసీ తేవడంతో గతంలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసిన 893 మంది ఔట్సోర్సింగ్ సిబ్బంది రోడ్డున పడ్డారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఎంతోమంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్లపై వేటు వేశారు. జిల్లాలోని సచివాలయాల్లో 1,066 ఖాళీ పోస్టులు ఉండగా వాటిని భర్తీ చేయకుండా క్లస్టర్ల పేరిట ఉద్యోగులను క్రమబద్ధీకరించి మిగిలిన వారిని ఇతర శాఖల్లో భర్తీ చేసే యోచన చేస్తోంది.
భృతి.. భ్రాంతేనా ?
2014 ఎన్నికల్లో రూ.2 వేల చొప్పున భృతి ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాలుగున్నర సంవత్సరాల పాటు ఆ ఊసే ఎత్తలేదు. నాటి విపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒత్తిడి తీసుకురావడంతో 2019 ఎన్నికలకు ఆరు నెలల ముందు యువనేస్తం అంటూ తంతు నడిపించారు. 22 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వయసున్న, డిగ్రీ చదివిని వారిని మాత్రమే అర్హులుగా ప్రకటించారు. జిల్లాలో లక్ష మందికి పైగా నిరుద్యోగ యువత ఉంటే పలు వడపోతల నడుమ సుమారు ఆరు వేల మందిని మాత్రమే అర్హులుగా గుర్తించారు.
నిరుద్యోగ
భృతి
ఎప్పుడు?
ఉద్యోగాల మాటేంటి?
న్యూస్రీల్
బాబు మార్కు టోకరా
జాబు కావాలంటే బాబు రావాలన్న కూటమి
నిరుద్యోగులకు నెలకు రూ.3,000 ఇస్తామని హామీ
ఏడాదైనా నిరుద్యోగ భృతి ఊసెత్తని సర్కారు
జిల్లాలో 5.17 లక్షల కుటుంబాల ఎదురుచూపులు
కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న వాటి నీ తొలగిస్తున్న వైనం
యువతకు అండగా నిలిచిన గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం
గత ప్రభుత్వంలోనిరుద్యోగులకు భరోసా
2014–19 వరకు టీడీపీ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా కేవలం 34,108 మందికి మాత్రమే ఉద్యోగాలు కల్పిస్తే 2019–24 వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఒక్క పశ్చిమగోదావరి జిల్లాలోనే శాశ్వత, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్లో 15 వేలకు పైగా ఉద్యోగాలు కల్పించడం గమనార్హం. వీటిలో సచివాలయ ఉద్యోగాలు 4,230 మంది ఉన్నాయి.
నిరుద్యోగులకు నిరాశే
ఉన్నత చదువులు చదివి ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నాను. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఇచ్చిన హామీని అమలు చేయాలి. కూటమి నాయకులు చెప్పినట్టు నిరుద్యోగులకు భృతి రూ.3 వేలు ఇచ్చి ఆదుకోవాలి. ఆ దిశగా ప్రభుత్వం ముందడుగు వేయాలి.
– కొప్పిశెట్టి లోవచంద్ర మహేష్, నిరుద్యోగి, భీమవరం
భృతి ప్రస్తావనే లేదు
కూటమి ప్రభుత్వంలో నిరుద్యోగ భృతి ప్రస్తావనే లేదు. ఇలా మోసపూరిత వాగ్దానాలతో యువతను మోసగించడం తగదు. చంద్రబాబు 2014 ఎన్నికల్లోనూ నిరుద్యోగ భృతి అంటూ మోసం చేశారు. మరలా 2024 ఎన్నికల్లో అదే హామీ ఇచ్చి మోసం చేస్తున్నారు.
– కె.ప్రవీణ్ కుమార్, సీతారాంపురం

నిరుద్యోగ భృతి.. భ్రాంతి

నిరుద్యోగ భృతి.. భ్రాంతి

నిరుద్యోగ భృతి.. భ్రాంతి

నిరుద్యోగ భృతి.. భ్రాంతి