
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
భీమవరం (ప్రకాశంచౌక్): మొక్కలు నాటడంతో పాటు, ప్రకృతి సమతుల్యతను కాపాడటానికి కాలుష్య కారకంగా ఉన్న ప్లాస్టిక్ నియంత్రణే లక్ష్యంగా కృషి చేస్తున్నట్టు కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా అంతట శ్రీవనం–మనం్ఙ పేరిట మొక్కలు నాటడం, కాలువలు, డ్రెయిన్లలో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. కలెక్టర్ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్కుమార్రెడ్డి, డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, అధికారులు భీమవరం కలెక్టరేట్లో మొక్కలు నాటారు. అనంతరం విస్సాకోడేరు కాలువ వెంబడి ప్లాస్టిక్ వ్యర్థాలను, జేపీ రోడ్డులోని అడ్డ వంతెన వద్ద కాలువ గట్లపై ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించే కార్యక్రమంలో కలెక్టర్ పాలఒగన్నారు. కాలువల్లో వ్యర్థాల తొలగింపు కార్యక్రమాన్ని పరివీలించారు. జిల్లావ్యాప్తంగా 3.85 లక్షల మొక్కలను నాటే కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. అటవీశాఖ పర్యవేక్షణలో జిల్లాలోని వెంకటరామన్నగూడెం, సీతారాంపురం, కొణితివాడ గ్రామాల్లో నర్సరీలను అభివృద్ధి చేశామన్నారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కా ర్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా అదనపు ఎస్పీ వి.భీమారావు, జిల్లా అటవీ శాఖ అధికారి డి.ఆశాకిరణ్, కేఆర్ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శివన్నారాయణరెడ్డి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ అధికారి డాక్టర్ కేసీహెచ్ అప్పారావు, ఆర్డీఓలు కె.ప్రవీణ్కుమార్ రెడ్డి, దాసిరాజు, కతీబ్ కౌసర్ భానో పాల్గొన్నారు.
రోగుల నుంచి సొమ్ముల వసూలును ఊరుకోం
ప్రభుత్వాస్పత్రికి వచ్చే రోగుల నుంచి సిబ్బంది సొమ్ములు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ నాగరాణి హెచ్చరించారు. భీమవరం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి వైద్యాధికారులు, ఏరియా ఆస్పత్రి డాక్టర్లు, సూపరింటెండెంట్లతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు, రోగులకు అందుతున్న సేవలు, మౌలిక సదుపాయాలు కల్పన, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు పెంచేలా గర్భిణులను ప్రోత్సహించాలని కలెక్టర్ అన్నారు.
కలెక్టర్ నాగరాణి