విద్యార్థులభవిష్యత్తుతో చెలగాటం | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులభవిష్యత్తుతో చెలగాటం

May 3 2025 8:35 AM | Updated on May 3 2025 8:35 AM

విద్యార్థులభవిష్యత్తుతో చెలగాటం

విద్యార్థులభవిష్యత్తుతో చెలగాటం

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో శాఖలుగా విస్తరించిన ఒక ప్రైవేటు విద్యా సంస్థ ఏలూరు పరిసర ప్రాంతాల విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటమాడుతోంది. కొన్నేళ్ళుగా నగరంతో పాటు పరిసర ప్రాంతాల విద్యార్థులను పాఠశాలలో చేర్చుకుని, తల్లిదండ్రుల నమ్మకం సంపాదించి ఈ విద్యా సంవత్సరంలో ఎలాంటి సమాచారం లేకుండా పాఠశాలను మూసివేశారని తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. పాఠశాల మూసివేత సమయానికి సుమారు 300 మంది విద్యార్థులు ఉన్నట్లు చెబుతున్నారు. పాఠశాల మూసివేసే ఆలోచన ఉంటే ఒక ఏడాది ముందుగా విద్యార్థుల తల్లిదండ్రుల దృష్టిలో పెట్టాలని, పాఠశాల యాజమాన్యం అలా చేయకుండా గుట్టుచప్పుడు కాకుండా మూసివేసి తమ బిడ్డలకు మరో పాఠశాలలో ప్రవేశాలు పొందే అవకాశం కూడా లేకుండా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏడాదంతా మూసివేత విషయం చెప్పకుండా వారం క్రితం మాత్రమే సమావేశం పెట్టి ఈ విషయం చెప్పారని మండిపడుతున్నారు. పాఠశాల మూసివేత విషయాన్ని గోప్యంగా ఉంచి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫీజులు వసూలు చేసుకున్నారని, ఫీజుల చెల్లింపునకు కొంత సమయం కావాలని వేడుకున్నా ప్రిన్సిపాల్‌ ససేమిరా అంటూ పిల్లలను ఇబ్బందులకు గురిచేశారని వాపోతున్నారు. ఉచిత సీట్లు పొందిన వారి నుంచి సైతం ఫీజులు వసూలు చేశారని, ఫీజులు చెల్లించకపోతే ఇబ్బందులకు గురి చేశారని తల్లిదండ్రులు చెబుతున్నారు. పాఠశాలకు వెళ్ళి తమ బిడ్డల టీసీలు ఇవ్వాలని కోరగా విజయవాడ వెళ్ళి తీసుకోవాలని, ప్రిన్సిపాల్‌, డీన్‌ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల అక్రమంగా మూసివేసి తమ బిడ్డల భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేసిన ఆ విద్యా సంస్థ యాజమాన్యంపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతూ శుక్రవారం జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మను కలిసి వినతిపత్రం సమర్పించారు. తన కుమార్తెకు ఉచిత సీట్ల కోటాలో సీటు వచ్చినా ఫీజు చెల్లించాల్సిందేనని చెప్పగా.. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు ఫిర్యాదు చేశానని, అయినా చర్యలు తీసుకోలేదని లంకపేటకు చెందిన ఎన్‌.దుర్గా నాగేంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడు ఈ ఏడాది 10లోకి వచ్చాడని, కొన్ని రోజులు తరగతులు నిర్వహించి పుస్తకాలు కొనుగోలు చేయాలని రూ.13 వేలు వసూలు చేసి ఇప్పుడు స్కూలు మూసేయడం అన్యాయమని ఏలూరుకు చెందిన వి.నాగలక్ష్మి తప్పుపట్టారు.

ఏలూరులో అర్ధాంతరంగా పాఠశాల మూసివేత

ఫీజులు వసూలు చేసి, పుస్తకాలు అమ్ముకున్న వైనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement