వైఎస్సార్‌సీపీ పార్లమెంట్‌ పరిశీలకుల నియామకం | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ పార్లమెంట్‌ పరిశీలకుల నియామకం

Apr 30 2025 12:42 AM | Updated on Apr 30 2025 12:48 AM

వైఎస్

వైఎస్సార్‌సీపీ పార్లమెంట్‌ పరిశీలకుల నియామకం

సాక్షి ప్రతినిధి, ఏలూరు: వైఎస్సార్‌సీపీ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిశీలకులను మంగళవారం నియమించారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు వెలువరించింది. పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్లకు అనుసంధానంగా పరిశీలకులు పనిచేసేలా నియమించారు. ఏలూరు పార్లమెంట్‌ పరిశీలకుడిగా ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్‌, నరసాపురం పార్లమెంట్‌ పరిశీలకుడిగా కాకినాడ జిల్లా పత్తిపాడుకు చెందిన పార్టీ నేత ముదునూరి మురళీకృష్ణంరాజును నియమించారు. చింతలపూడి నియోజకవర్గానికి చెందిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావును మచిలీపట్నం పార్లమెంట్‌ పరిశీలకులుగా నియమించారు.

ఆరోగ్యకర వాతావరణం కల్పించాలి

కాళ్ల: ప్రజలకు ఆహ్లాదకరమైన, ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని కల్పించేలా అవసరమైన అభివృద్ధి పనులే చేపట్టేందుకు కృషి చేస్తున్నామని కలెక్టర్‌ చదలవాడ నాగరాణి అన్నారు. కాళ్ల మండలం పెదఅమిరంలో కలెక్టర్‌ మంగళవారం పర్యటించారు. ఏఏ ప్రాంతాల్లో ఎంతెంత విస్తీర్ణం ఖాళీ స్థలాలు ఉన్నాయో జిల్లా కలెక్టర్‌కు సర్వేయర్‌ వివరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ భీమవరం పట్టణ వాసుల ఆహ్లాదానికి, ఆరోగ్యానికి దోహదపడే పలు ప్రాజెక్టులను దాతల సహకారంతో చేపట్టామని, పనులు వివిధ దశలలో పురోగతిలో ఉన్నాయన్నారు. ఈ పనులు పూర్తయితే పార్కులు, వాకింగ్‌ ట్రాక్స్‌, జిమ్‌ ఏరియా, గ్రీనరీ అభివృద్ధి, ఫౌంటెన్‌లు, పాత బస్టాండ్‌ పునర్నిర్మాణం, బస్టాప్‌ అందుబాటులో వస్తాయని, తద్వారా పట్టణ ప్రజలకు ఆరోగ్యం, ఆహ్లాదం, సౌకర్యవంతమైన జీవన శైలి సమకూరుతుందన్నారు. కార్యక్రమంలో కాళ్ల తహసీల్దార్‌ జి.సుందర్‌సింగ్‌, ఎంపీడీవో డాక్టర్‌ బి.స్వాతి, ఈఓపీఆర్డీ ఎంవీ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

మానసిక వైద్యశాలల పరిశీలన

భీమవరం : భీమవరం పట్టణంలోని శాంతి నర్సింగ్‌ హోం, ప్రశాంతి నర్సింగ్‌ హోమ్‌, వర్మ హాస్పిటల్‌ను మంగళవారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్న ప్రసాద్‌ సందర్శించారు. ఈ సందర్బంగా వైద్యులను మానసిక రోగుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోగులకు అందుతున్న సౌకర్యాలు, వారి మానసిక స్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో శాంతి మానసిక వైద్యశాల డాక్టర్‌ జీవీ రమణరావు, ప్రశాంతి వైద్యశాల డాక్టర్‌ మాదిరెడ్డి వెంకటరమణ, వర్మ హాస్పిటల్స్‌ మానసిక వైద్యురాలు శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

చలివేంద్రాలు

ఏర్పాటు చేయాలి

భీమవరం (ప్రకాశంచౌక్‌): వేసవి దృష్ట్యా జిల్లాలో ప్రజలకు సమృద్ధిగా తాగునీరు అందించేందుకు అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ చదలవాడ నాగరాణి సూచించారు. మంగళవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం నుంచి వడగాల్పులు, వర్క్‌ ఫ్రం హోం, ఈకేవైసీ తదితర అంశాలపై గూగుల్‌ మీట్‌ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వడగాల్పుల బారిన పడకుండా ఉపాధి హామీ కార్మికులు ఉదయమే పనులు చేయాలన్నారు. రద్దీగా ఉన్న ప్రాంతాలను గుర్తించి చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని మున్సిపల్‌, పంచాయతీ అధికారులను ఆదేశించారు.

వైఎస్సార్‌సీపీ పార్లమెంట్‌ పరిశీలకుల నియామకం  1
1/4

వైఎస్సార్‌సీపీ పార్లమెంట్‌ పరిశీలకుల నియామకం

వైఎస్సార్‌సీపీ పార్లమెంట్‌ పరిశీలకుల నియామకం  2
2/4

వైఎస్సార్‌సీపీ పార్లమెంట్‌ పరిశీలకుల నియామకం

వైఎస్సార్‌సీపీ పార్లమెంట్‌ పరిశీలకుల నియామకం  3
3/4

వైఎస్సార్‌సీపీ పార్లమెంట్‌ పరిశీలకుల నియామకం

వైఎస్సార్‌సీపీ పార్లమెంట్‌ పరిశీలకుల నియామకం  4
4/4

వైఎస్సార్‌సీపీ పార్లమెంట్‌ పరిశీలకుల నియామకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement