
అర్జీలు క్షుణ్ణంగా పరిశీలించాలి
ఆన్లైన్లో చాటింగ్.. ఆపై మోసం
భీమడోలు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళకు ఆన్లైన్లో పరిచయమైన వ్యక్తి నమ్మించి బాధితురాలి నుంచి దఫాదఫాలుగా రూ.1,60,900లు స్వాహా చేశాడు. 8లో u
కలెక్టర్ సి. నాగరాణి
భీమవరం(ప్రకాశం చౌక్): అర్జీదారుల సమస్యలను క్షుణ్నంగా పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఫిర్యాదుదారుల నుంచి 246 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలు క్షుణ్నంగా పరిశీలించి తక్షణ పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సమస్య పరిష్కారం కాకపోతే మండల స్థాయి అధికారులతో చర్చించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, కెఆర్ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.శివన్నారాయణ రెడ్డి, జిల్లా గ్రామ, వార్డు సచివాలయం అధికారి వై.దోసిరెడ్డి, డ్వామా పీడీ డాక్టర్ కె.సి.హెచ్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. పెన్షన్ పెంపు కోసం కలెక్టరేట్కు వచ్చిన దివ్యాంగుల వద్దకు జాయింట్ కలెక్టర్ వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.