
ఉగ్ర దాడికి నిరసనగా..
భీమవరం: కాశ్మీర్లో ఉగ్రదాడిని ఖండిస్తూ భీమవరంలో శుక్రవారం ఇండియన్ ఫోరం ఫర్ పీస్ అండ్ డెమోక్రసీ ఆధ్వర్యంలో మతాలకతీతంగా కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ప్రకాశంచౌక్ సెంటర్లో ర్యాలీనుద్దేశించి ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ ముహమ్మద్ సిద్ధిక్ మాట్లాడుతూ ఉగ్రవాదుల దాడి మానవతపై జరిగిన దాడిగా అభివర్ణించారు. సీపీఎం సెక్రెటరియేట్ సభ్యుడు బి.బలరామ్, దళిత ఐక్య వేదిక అధ్యక్షుడు గంటా సుందరకుమార్, సీపీఎం జిల్లా కార్యదర్శి జెఎన్వి గోపాలన్, జమాతే ఇస్లామీ హింద్, స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజెషన్, క్రైస్తవ, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.
తణుకులో..
తణుకు అర్బన్: ఉగ్రవాదుల మారణకాండకు నిరసనగా తణుకులో ముస్లిం మహిళలు శుక్రవారం నిరసన తెలిపారు. ఉగ్రవాదం నశించాలి.. హంతకులను శిక్షించాలంటూ నినాదాలు చేశారు. ముస్లిం మహిళలతోపాటు ఐద్వా మహిళలు పాల్గొన్నారు.

ఉగ్ర దాడికి నిరసనగా..