
మెరిసిన కాకతీయ విద్యార్థులు
భీమవరం: భీమవరం పట్టణంలోని కాకతీయ మెరిట్ స్కూల్ విద్యార్థులు పదో తరగతి పరీక్షా ఫలితాల్లో నూరుశాతం ఉత్తీర్ణత సాధించారని స్కూల్ కరస్పాండెంట్ అక్కినేని కృష్ణకిషోర్ బుధవారం చెప్పారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన వారిలో ఎస్ వెంకట హర్షిణి 592, బి జయశ్రీ 589, బి రవి ఆదినారాయణ 587 మార్కులు సాధించారన్నారు. అలాగే 26 మంది విద్యార్థులు 500కి పైగా మార్కులు సాధించగా 10 మంది విద్యార్థులు 570 కంటే ఎక్కువ మార్కులు సాఽధించినట్లు చెప్పారు.
ఆదిత్య విద్యార్థుల ప్రతిభ
భీమవరం: పదవ తరగతి పరీక్షల్లో భీమవరం ఆదిత్య స్కూల్ విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారని స్కూల్ డైరెక్టర్ ఆదిత్య కృష్ణంరాజు చెప్పారు. విద్యార్థులు ఎంఎస్ నాగశివాని 587, ఎం శర్వాణి 585, పీఎస్ఎస్వీ రామ్నిహాల్ 585, డి రాఘవశ్రీనిధి 584, ఎస్ దర్శన్బాబు 584, వై దాక్షిణ్య 584, ఎం ఆర్షియ 583, ఎన్ జనని 582, ఎం వర్షిత 580, పి హర్షవర్ధన్రాజు 580 మార్కులు సాధించినట్లు వివరించారు. మొత్తం విద్యార్థుల్లో 80 మంది 540కు పైగా, 124 మంది 500కు పైగా మార్కులు సాధించినట్లు కృష్ణంరాజు చెప్పారు.

మెరిసిన కాకతీయ విద్యార్థులు