
సామాజిక న్యాయం కోసం అవిశ్రాంత పోరు
ఏలూరు (టూటౌన్): రోమన్ క్యాథలిక్ అత్యున్నత మతగురువు పోప్ ఫ్రాన్సిస్ మరణం పట్ల ఏలూరు మేత్రాసన పీఠాధిపతి పొలిమేర జయరావు ప్రగాఢ సంతాపం తెలిపారు. మంగళవారం బిషప్ హౌస్లో పోప్ ఫ్రాన్సిస్ చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. పోప్ ఫ్రాన్సిస్ అందించిన సేవలను స్మరించుకున్నారు. సామాజిక న్యాయం కోసం, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అసమానతలకు వ్యతిరేకంగా పోప్ ఫ్రాన్సిస్ అవిశ్రాంతంగా పోరాటం చేశారని కొనియాడారు. ప్రొక్యురేటర్ ఫాదర్ బి.రాజు, మైకేల్ చర్చ్ ఫాదర్ దిరిసిన ఆరోన్, ఏలూరు వికార్ జనరల్ ఫాదర్ పి.బాల, అమలోద్భవి కెథడ్రల్ చర్చి విచారణ గురువు ఫాదర్ ఐ.మైఖేల్ పాల్గొన్నారు.