మండుతున్న ఎండలతో జనం బెంబేలు | - | Sakshi
Sakshi News home page

మండుతున్న ఎండలతో జనం బెంబేలు

Apr 23 2025 7:59 PM | Updated on Apr 23 2025 7:59 PM

మండుత

మండుతున్న ఎండలతో జనం బెంబేలు

డాక్టర్‌ ఎండీ రసూల్‌

చింతలపూడి: జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఎండలు ఇప్పుడే ఇంత తీవ్రంగా ఉంటే రోహిణీ కార్తె ప్రారంభమైతే ఇంకెంత దారుణంగా ఉంటాయోనని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. మండే ఎండల నుంచి ఎలా కాపాడుకోవాలా అని ఆందోళన చెందుతున్నారు. పిల్లలను కోచింగ్‌లకు పంపాలన్నా, ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లాలంటే దడ, ఎక్కడ ఎండ దెబ్బకు బలైపోతామోనని భయపడుతున్నారు. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు ఇళ్ళల్లో నుండి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు ఎండ తాకిడికి తట్టుకోలేక పోతున్నారు.ఈ పరిస్థితుల్లో ఎండలు, వడగాడ్పులు తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రి వైద్యులు డాక్టర్‌ రసూల్‌ సూచించారు. ఆ సూచనలు ఏంటో? ఓసారి తెలుసుకుందాం

ఎండల వల్ల వచ్చే వ్యాధులు

● వేసవి నేపథ్యంలో బ్యాక్టీరియా ఎఫెక్ట్‌ వల్ల పెద్ద వారిలో సెగ్గెడ్డలు వచ్చే అవకాశాలు ఎక్కువ. దీనికి డాక్టర్‌ సలహాతో నోటితో తీసుకునే యాంటీబయోటిక్‌ మందులు వాడాలి.

● ఎండలకు జుట్టుపై ఉండే క్యూటికల్‌ పొర దెబ్బతిని జుట్టు సహజత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. వేసవిలో ఎక్కువగా మసాలాలతో కూడిన ఆహార పదార్థాలు తీసుకోకూడదు.

వేసవిలో వాడాల్సిన దుస్తులు

● ఎండాకాలంలో వదులుగా ఉండే దుస్తులు వాడాలి. చెమటను పీల్చుకునే కాటన్‌ దుస్తులు వాడాలి.

● టైట్‌ జీన్స్‌ ఫ్యాంట్‌లు వాడకూడదు.

● తెల్లని దుస్తులు వాడితే మంచిది. నల్లని దుస్తులు వాడకుండా ఉంటే ఉత్తమం.

● చిన్నపిల్లలకు ఎక్కువగా వదులుగా ఉండే దుస్తులు వాడాలి.

● రంధ్రాలు ఉండే టోపీలను వాడితే జుట్టుకు చెమట పట్టకుండా ఉంటుంది.

వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

● వేసవిలో రోజూ నాలుగు నీటర్ల కంటే ఎక్కువ నీరు తాగాలి. చిన్న పిల్లలు, వృద్ధులకు ఎక్కువ నీరు దఫదఫాలుగా ఇస్తూ ఉండాలి.

● మజ్జిగ, కొబ్బరి నీళ్లు, చెరుకు రసం, పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలి.

● పిల్లలను ఎక్కువగా ఫ్యాన్‌ కింద ఉంచితే చర్మ వ్యాధులు రావు. ఆర్డినరీ టాల్కమ్‌ పౌడర్‌ వాడితే చెమట కాయల నుంచి రక్షణ పొందవచ్చు.

● పెద్దలకు చర్మ వ్యాధులు వస్తే యాంటీబయోటిక్స్‌ వాడాల్సి ఉంది.

● చల్లని ఏసీ ప్రదేశం నుంచి వెంటనే ఎండలోకి వెళ్లకూడదు. వేసవిలో బయటికి వెళ్లేటప్పుడు తప్పని సరిగా గొడుగు వేసుకోవాలి.

● ద్విచక్ర వాహన చోదకులు కళ్లకు కూలింగ్‌ కళ్లజోళ్లు, నెత్తిన టోపీ వాడాలి.

క్రమేపీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు

జిల్లాలో గత నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు ఇలా

పట్టణం గరిష్టం కనిష్టం

22–04–2025

జంగారెడ్డిగూడెం 42 25

ఏలూరు 42 25

నూజివీడు 42 26

21–04–2025

జంగారెడ్డిగూడెం 41 26

ఏలూరు 42 25

నూజివీడు 41 26

20–04–2025

జంగారెడ్డిగూడెం 38 28

ఏలూరు 37 29

నూజివీడు 37 27

19–04–2025

జంగారెడ్డిగూడెం 40 27

ఏలూరు 39 27

నూజివీడు 39 27

మండుతున్న ఎండలతో జనం బెంబేలు 1
1/1

మండుతున్న ఎండలతో జనం బెంబేలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement