
పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్లో చేరికలు
నర్సంపేట: ప్రభుత్వం సంక్షేమ పథకాలకు అకర్షితులై పలు పార్టీలకు చెందిన నాయకులు కాంగ్రెస్ లో చేరుతున్నారని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. పట్టణంలోని ఒకటో వార్డుకు చెందిన కందికట్ల వీరేశ్ ఆధ్వర్యంలో పలు పార్టీలకు చెందిన సుమారు 30 కుటుంబాలు ఎమ్మెల్యే దొంతి సమక్షంలో కాంగ్రెస్లో చేరాయి. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే మాధవరెడ్డి ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని తెలిపారు. మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, టీపీసీసీ సభ్యుడు పెండెం రామానంద్ పాల్గొన్నారు.
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
నెక్కొండ: పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని, అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేందుకు కృషి చేస్తానని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. చంద్రుగొండ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఆరు గ్యారంటీలను ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. టీపీసీసీ సభ్యుడు పెండెం రామానంద్, నెక్కొండ, నర్సంపేట మార్కెట్ చైర్మన్లు రావుల హరీశ్రెడ్డి, పాలాయి శ్రీనివాస్, పార్టీ మండల అధ్యక్షుడు బక్కి అశోక్, మాజీ జెడ్పీటీసీ బక్కి కవిత, నర్సంపేట కోర్టు ఏజీపీ బండి శివకుమార్, నాయకులు పెండ్యాల హరిప్రసాద్, కేవీ. సుబ్బారెడ్డి, కుసుమ చెన్నకేశవులు పాల్గొన్నారు.
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి