కొత్తగూడెం గ్రామానికి ఆర్టీసీ బస్సు పునరుద్ధరణ | - | Sakshi
Sakshi News home page

కొత్తగూడెం గ్రామానికి ఆర్టీసీ బస్సు పునరుద్ధరణ

Jun 23 2025 5:24 AM | Updated on Jun 23 2025 5:24 AM

కొత్త

కొత్తగూడెం గ్రామానికి ఆర్టీసీ బస్సు పునరుద్ధరణ

సంగెం: మండలంలోని కొత్తగూడెం గ్రామానికి ఆర్టీసీ బస్సును పునరుద్ధరించినట్లు హనుమకొండ డిపో మేనేజర్‌ ధరమ్‌సింగ్‌ తెలి పారు. ఆదివారం ఆయన ఎస్సై నరేశ్‌తో కలిసి కొత్తగూడెంలో బస్సును ప్రారంభించి మాట్లాడారు. ప్రస్తుతం రోజుకు రెండు ట్రిప్పులు నడుస్తుందన్నారు. వరంగల్‌, ఖిలావరంగల్‌, స్తంభంపల్లి, వెంకటాపూర్‌, కాట్రపల్లి, కుంటపల్లి, సంగెం, తిమ్మాపూర్‌, గాంధీనగర్‌, కొత్తగూడెం తదితర గ్రామాల ప్రజలకు బస్సు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో రిటైర్డ్‌ ఏసీపీ సురేందర్‌, పంచాయతీ కార్యదర్శి రంజిత్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు మాధవరెడ్డి, నాయకులు జనగాం రమేశ్‌, జగన్నాథచారి, పాషా, రాంరెడ్డి, గాలి చేరాలు, ఎనబోతుల సదయ్య, సాంబయ్య, రాజీవ్‌ తదితరులు పాల్గొన్నారు.

తండా అభివృద్ధికి

కృషిచేయాలి

నర్సంపేట రూరల్‌: రాజకీయ పార్టీలకు అతీతంగా పుట్టి పెరిగిన తండా అభివృద్ధికి కృషిచేయాలని భూపాలపల్లి జిల్లా క్రైం డీఎస్పీ భూక్యా నారాయణ సూచించారు. నర్సంపేట మండలంలోని భోజ్యానాయక్‌తండాలో కోర్‌ కమిటీ (ఆత్మీయ సమ్మేళనం) సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ బంజారా సంప్రదాయాలను భవిష్యత్‌ తరాలకు అందించేందుకు తండా పండుగలను ఘనంగా జరుపుకోవాలన్నారు. అనంతరం ప్రతిభ కనబర్చిన విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులను శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. ఖమ్మం జిల్లా మఽధిర సీఐ సాగర్‌, మహబూబాబాద్‌ జిల్లా సీఐ శంకర్‌, హెడ్‌కానిస్టేబుల్‌ భూక్యా జంపయ్య, ఎల్‌ఎఐసీ బిజినెస్‌ అసోసియేట్‌ నాథం, టీచర్‌ ఆర్జ్య, హైదరాబాద్‌ పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ అజ్మీరా శ్రీనివాస్‌, గ్రామానికి చెందిన 102 మంది ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

భద్రకాళి అమ్మవారికి రూ.కోటితో రథం

హన్మకొండ కల్చరల్‌ : కంచి కామాక్షి అమ్మవారి రథం మాదిరిగా శ్రీభద్రకాళి అమ్మవారికి రూ.కోటి వ్యయంతో రథం తయారు చేయించడానికి ఆలయ ధర్మకర్తల మండలి తీర్మానించింది. ఈనెల 26 నుంచి ప్రారంభమయ్యే శాకంబరీ ఉత్సవాల ఏర్పాట్లపై చర్చించేందుకు ఆదివారం దేవాలయ కార్యాలయంలో వ్యవస్థాపక ధర్మకర్త డాక్టర్‌ బండారు శివసుబ్రహ్మణ్యం అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించారు. ఆలయ ఈఓ శేషుభారతి, ధర్మకర్తలు, ఆలయ ప్రధానార్చకుడు శేషు పాల్గొన్నారు. అమ్మవారి గుడి చుట్టూ మాడవీధుల నిర్మాణం జరుగుతున్నందున ఇకపై అమ్మవారికి నిర్వహించే వాహన, రథసేవలు మాడవీధుల గుండానే చేపట్టనున్నారు. ఇందులో భాగంగా ఆగమశాస్త్రం ప్రకారం టేకు కర్రతో రథం తయారు చేయించడానికి మండలి తీర్మానించారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి అనుమతికి కృషి చేయాలని మంత్రి కొండా సురేఖ, వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డిని ధర్మకర్తల మండలి సభ్యులు కోరారు. నిత్యం ఉదయం, సాయంత్రం, రాత్రి మహాపూజ అనంతరం భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేయాలని, ఇందుకు శాశ్వత నిధిని బ్యాంకులో ఏర్పాటు చేయడానికి దాతలు విరాళం అందించాలని విజ్ఞప్తి చేశారు. అర్చకులు భద్రకాళి శేషు, ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, గదె శ్రవణ్‌కుమార్‌ రెడ్డి, ఓరుగంటి పూర్ణచందర్‌, తొగరు క్రాంతి, బింగి సతీష్‌, మోతుకూరి మయూరి, గండ్ల స్రవంతి, నార్ల సుగుణ, పాలడుగుల అంజనేయులు, జారతి వెంకటేశ్వర్లు, అనంతుల శ్రీనివాస్‌రావు, పార్నంది నరసింహమూర్తి పాల్గొన్నారు.

నేడు గ్రేటర్‌ వరంగల్‌ గ్రీవెన్స్‌

వరంగల్‌ అర్బన్‌ : వరంగల్‌ మహా నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అదనపు కమిషనర్‌ జోనా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ప్రజల నుంచి రాతపూర్వకంగా దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు.

కొత్తగూడెం గ్రామానికి ఆర్టీసీ బస్సు పునరుద్ధరణ1
1/2

కొత్తగూడెం గ్రామానికి ఆర్టీసీ బస్సు పునరుద్ధరణ

కొత్తగూడెం గ్రామానికి ఆర్టీసీ బస్సు పునరుద్ధరణ2
2/2

కొత్తగూడెం గ్రామానికి ఆర్టీసీ బస్సు పునరుద్ధరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement