
అభివృద్ధిలో అగ్రస్థానం
వనపర్తి: అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం తెలంగాణ రైజింగ్–2047 విజన్తో పనిచేస్తోందని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్ ఎన్.ప్రీతం అన్నారు. సోమవారం కలెక్టరేట్లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రీతం హాజరు కాగా.. జిల్లా యంత్రాంగం ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ రావుల గిరిధర్తో కలిసి ఆయన తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివా ళి అర్పించారు. అనంతరం పోలీసు బలగాల గౌరవ వందనం స్వీకరించి.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడు తూ.. తెలంగాణ రైజింగ్–2047 విజన్లో పేదల సంక్షేమం, సమగ్ర పాలసీల రూపకల్పన, ప్రపంచస్థాయి ఇన్ఫ్రా డెవలప్మెంట్, పారదర్శక పాలనకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఈ లక్ష్యాల సాధనకు ప్రభుత్వం ఇప్పటికే పక్కా ప్రణాళిక రూపొందించిందని వివరించారు.
తెలంగాణ రైజింగ్–2047 విజన్తో పనిచేస్తున్నాం
● కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దుతాం
● యువతకు ఉపాధి, ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ముందుకు..
● రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్ ఎన్. ప్రీతం
● ఘనంగా తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవం
జాతీయ పతాకం ఆవిష్కరించి
వందనం సమర్పిస్తున్న రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్ ఎన్.ప్రీతం, ఎమ్మెల్యే మేఘారెడ్డి,
కలెక్టర్ ఆదర్శ్ సురభి,
ఎస్పీ రావుల గిరిధర్ తదితరులు
ఆడబిడ్డలకు అండగా..
ఆడబిడ్డలు ఆనందంగా ఉన్న ఇంటా మహాలక్ష్మి తాండవిస్తుందన్నారు. అందుకే రాష్ట్రంలో కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యంతో జిల్లాలో సుమారు 2.39 కోట్ల మంది మహిళలు రూ. 78.42కోట్ల లబ్ధి పొందినట్టు తెలిపారు. రూ. 500కే వంటగ్యాస్ సరఫరాతో ఇప్పటి వరకు 84,399 మందికి గాను 2.34 లక్షల సిలిండర్లను పంపిణీ చేసి.. రూ. 6.56లక్షల లబ్ధి చేకూర్చామన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్తో 81,649 మంది వినియోగదారులకు ప్రభుత్వం రూ. 24.51 కోట్ల సబ్సిడీ మొత్తాన్ని అందజేసినట్లు వెల్లడించారు. మహిళలు పెట్రోల్ బంకులు, మహిళాశక్తి క్యాంటీన్ల నిర్వహణ చేపట్టారన్నారు. శిల్పారామంలో 100 ఇందిరా మహిళాశక్తి స్టాళ్లను తమ ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. మహిళా సంఘాలతో 600 బస్సులు కొనుగోలు చేయించి.. ఆర్టీసీకి అద్దెకు ఇవ్వనున్నట్టు తెలిపారు.
రాష్ట్ర యువతే ప్రజా ప్రభుత్వ నిర్మాతలు అని అన్నారు. వారి భవిష్యత్కు గ్యారంటీ ఇస్తూ.. ఉపాధి, ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఏడాది కాలంలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడంతో పాటు రూ. 3లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి.. ప్రైవేటు రంగంలో లక్ష ఉద్యోగాలు సృష్టిస్తోందన్నారు. రాజీవ్ అభయహస్తం పథకంలో భాగంగా సివిల్స్ చదివే వారికి ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పునకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. అందులో భాగంగా వనపర్తి నియోజకవర్గంలో రూ. 200 కోట్లతో 25 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ నిర్మిస్తున్నట్లు చెప్పారు. పాఠశాలల అభివృద్ధికి విద్యా కమిషన్ ఏర్పాటు చేశామన్నారు.
చిన్నారి
నృత్యప్రదర్శన
యువతకు ఉపాధి,
ఉద్యోగాలు..