
కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీల ఆందోళన
వనపర్తి రూరల్: రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు ప్రకటించడంతో పాటు ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలంటూ శుక్రవారం జిల్లాకేంద్రంలో సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీ ఉపాధ్యాయులు, ఆయాలు ఆందోళన చేపట్టారు. ముందుగా మర్రికుంట నుంచి భారీ ర్యాలీగా కలెక్టరేట్కు చేరుకొని గేటు ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీల సంఘం జిల్లా అధ్యక్షురాలు శారద మాట్లాడుతూ.. కర్ణాటక రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాలకు రెండు నెలలు వేసవి సెలవులు ప్రకటించారని, తెలంగాణలోనూ వేసవి సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ఉద్యోగ భద్రతతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, కనీస వేతనం రూ.26 వేలు చెల్లిస్తూ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. అనంతరం రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లుకు డిమాండ్ల వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు బొబ్బిలి నిక్సన్, ఆర్యన్ రమేష్, మద్దిలేటి, రాములు, జ్యోతి, సుమతి, సంధ్య, రేణుక, లత, నిర్మల, కృష్ణవేణి, సరళ, నిర్మల, డీవైఎఫ్ఐ నాయకుడు కొప్పుల మహేష్ తదితరులు పాల్గొన్నారు.