
జాతీయ స్థాయిలో సత్తాచాటాలి
వనపర్తి టౌన్: రాష్ట్రస్థాయి ఫుట్బాల్ అండర్–14 జట్టు మంగళవారం జిల్లాకేంద్రం నుంచి మహారాష్ట్రలో జరగనున్న జాతీయ స్థాయి ఫుట్బాల్ పోటీలకు తరలివెళ్లినట్లు డీవైఎస్ఓ సుధీర్కుమార్రెడ్డి తెలిపారు. ఈ మేరకు క్రీడాకారులను అభినందించారు. ఫోన్లో క్రీడాకారులు ఎమ్మెల్యే మేఘారెడ్డి అభినందనలు తెలిపి, జాతీయ స్థాయిలో సత్తా చాటాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, స్కూల్ గేమ్స్ సెక్రటరీ సురేందర్రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, రాజేందర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాకేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థి ప్రణీత్ జాతీయ స్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపికయ్యాడని ఫిజికల్ డైరెక్టర్ కుమార్ తెలిపారు.