
అస్తవ్యస్తం
వనపర్తి
ఆహార భద్రత..
మంగళవారం శ్రీ 22 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
వివరాలు 8లో u
●
పొరపాట్లు వాస్తవమే..
కొత్త రేషన్ కార్డుల జారీలో కొన్నిచోట్ల పొరపాట్లు చోటు చేసుకున్న మాట వాస్తవమే. సాంకేతిక సమస్యల కారణంగా ఇలా జరిగి ఉండొచ్చు. ఈ విషయాన్ని ఇప్పటికే రాష్ట్రస్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. లబ్ధిదారుల అభ్యర్థన మేరకు తప్పులను సరిచేసే ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలు సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే పొరపాట్లను సరి చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. – కాశీవిశ్వనాథ్,
జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి
‘ఈ ఫొటోలో కనిపిస్తున్నది పాన్గల్కు చెందిన వీరస్వామి కుటుంబం. ఆయన ప్రజాపాలన గ్రామసభలో కొత్త రేషన్కార్డు కోసం భార్య, కుమారుడు, కుమార్తె నిత్యశ్రీ వివరాలతో దరఖాస్తు చేసుకున్నారు. కానీ అధికారులు మాత్రం తల్లి, తండ్రి, అన్న పేర్లను ఎగ్గొట్టి.. చిన్నారికి కార్డు మంజూరు చేశారు. తాజాగా ఏప్రిల్లో పాన్గల్లోని ఓ రేషన్ దుకాణానికి బియ్యం కోటా సైతం విడుదల చేశారు. జిల్లాలో ఇలాంటి ఘటనలు చాలానే ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.’
వనపర్తి: ఏళ్ల తర్వాత కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయన్న ప్రజల ఆశలను జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులు అడియాశలు చేశారు. ప్రజాపాలన గ్రామసభల్లో జిల్లావ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు, పేర్ల తొలగింపు, చేర్పుల కోసం 5,700 దరఖాస్తులు వచ్చాయి. పౌరసరఫరాలశాఖ అధికారులు దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి కొత్త కార్డుల జారీ, పేర్ల తొలగింపు, చేర్పులకు కసరత్తు చేపట్టారు. ఏప్రిల్ మొదటి వరకు 1,980 కార్డులు మంజూరుకాగా.. జారీ ప్రక్రియ అస్తవ్యస్తంగా మారింది. కుటుంబంలో కొందరికి ఒకచోట, మరికొందరికి మరో మండలం (వేరే ప్రాంతం)లో పేర్లు నమోదు చేస్తూ కార్డులు జారీ చేయడంతో ఒక్కసారిగా ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. జిల్లాలో పసిపిల్లల పేరుతో మంజూరైన ఘటనలూ చాలానే ఉన్నట్లు సమాచారం. అధికారులు గుట్టుచప్పుడు కా కుండా తప్పులను సరి చేసేందుకు ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.
5,700 దరఖాస్తులు..
రాష్ట్రంలో కాంగ్రెస్పార్టీ అధికారంలోకి వచ్చాక కొత్తగా మరో 5,700 దరఖాస్తులు వచ్చాయి. కార్డుల జారీ, పేర్ల తొలగింపు, చేర్పులను సైతం చేపడుతున్నట్లు ప్రకటించినా.. పూర్తిస్థాయిలో వివరాలు వెల్లడించేందుకు అధికారులు వెనుకాడుతున్నారు. ఇందుకు పెద్దమొత్తంలో తప్పులు దొర్లడమే కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఏళ్ల తర్వాత కొత్త కార్డులు వస్తున్నాయన్న సంతోషం దరఖాస్తుదారుల్లో లేకుండా పోయింది.
న్యూస్రీల్
పోలీసు ప్రజావాణికి మూడు వినతులు
వనపర్తి: జిల్లా పోలీసు కార్యాలయములో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 3 వినతులు అందాయి. డీసీఆర్బీ డీఎస్పీ, ఇన్చార్జ్ అదనపు ఎస్పీ ఉమామహేశ్వరరావు ఫిర్యాదులు స్వీకరించి వారితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సంబంధిత పోలీస్స్టేషన్ అధికారులకు ఫోన్చేసి తక్షణమే పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ఫిర్యాదుదారులకు న్యాయం అందుతుందనే భరోసా కల్పించేలా పోలీసు వ్యవస్థ పని చేస్తోందని తెలిపారు.
ఉపాధ్యాయులకు
శిక్షణ : డీఈఓ
వనపర్తి విద్యావిభాగం: ప్రాథమిక, ఉన్నత పాఠశాలల విద్యార్థులు వివిధ అంశాల్లో వెనుకబడి ఉన్నారని వివిధ సర్వేల్లో బహిర్గతం కావడంతో ఉపాధ్యాయుల్లో నైపుణ్యాలు పెంపొందించేందుకు వేసవి సెలవుల్లో శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించిందని జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ తెలిపారు. ఈ నెల 30 వరకు మండల, జిల్లాల పరిధిలో రిసోర్స్ పర్సనన్ల ఎంపిక ప్రక్రియ పూర్తిచేసి ఎన్సీఈఆర్టీకి జాబితా పంపుతామని.. రిసోర్స్ పర్సన్స్ ఎంపిక బాధ్యత కలెక్టర్, డీఈఓ, డైట్ అధ్యాపకులు, బీఎడ్ అధ్యాపకులు, యూనివర్సిటీ అధ్యాపకులు చేపడతారని చెప్పారు. ప్రతి మండలం నుంచి ప్రతి సబ్జెక్టులో ఇద్దరు ఎస్జీటీలు, జిల్లాల పరిధిలో స్కూల్ అసిస్టెంట్లను రిసోర్స్ పర్సన్స్గా ఎంపిక చేస్తామని చెప్పారు. ఎంపిక ప్రక్రియ పూర్తయిన తర్వాత మే నెలలో శిక్షణ కొనసాగుతుందన్నారు.
27న మోడల్ స్కూల్
ప్రవేశ పరీక్ష
ఖిల్లాఘనపురం: మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ పాఠశాలలో 2025–26 విద్యాసంవత్సరానికిగాను ప్రవేశాలకు ఈ నెల 27న అర్హత పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ ఉమాదేవి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 నుండి 12 గంటల వరకు 5వ తరగతి విద్యార్థులకు, మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష కొనసాగుతుందని చెప్పారు. విద్యార్థులు హాల్టికెట్లను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవాలని.. సకాలంలో పరీక్షకు హాజరుకావాలని పేర్కొన్నారు.
జిల్లాలో కొత్తగా 1,980 రేషన్కార్డులు మంజూరు
కుటుంబసభ్యుల పేర్లు లేకుండానే మూడేళ్ల పాపకు కార్డు జారీ..
ఆందోళనలో లబ్ధిదారులు ..
సరిచేస్తామంటున్న అధికారులు
చిన్నంబావి మండలం పెద్దదగడకు చెందిన ఓ కుటుంబం కొత్త రేషన్కార్డు కోసం ఇదివరకు నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభలో దరఖాస్తు చేసుకుంది. కుటుంబ యజమానికి అదే గ్రామంలో రేషన్కార్డు మంజూరు చేసి భార్య, ఇద్దరు పిల్లలకు అదే మండలంలోని అమ్మాయిపల్లిలో ఇతరుల రేషన్కార్డులో పేర్లు చేర్చారు. సదరు యజమాని తహసీల్దార్ కార్యాలయ అధికారులను సంప్రదించి సమస్యను వివరించగా.. సాంకేతిక సమస్యలతో పొరపాటుగా నమోదై ఉండవచ్చని, సరిచేస్తామని బదులిచ్చారు. ఒకే కుటుంబంలోని వ్యక్తులకు వేర్వేరు ప్రాంతాల్లో రేషన్ బియ్యం కోటా విడుదలైంది.

అస్తవ్యస్తం

అస్తవ్యస్తం