అంతర్రాష్ట్ర బండలాగుడు పోటీలు | - | Sakshi
Sakshi News home page

అంతర్రాష్ట్ర బండలాగుడు పోటీలు

Apr 20 2025 12:44 AM | Updated on Apr 20 2025 12:44 AM

అంతర్

అంతర్రాష్ట్ర బండలాగుడు పోటీలు

ఖిల్లాఘనపురం: మండలంలోని సోళీపురం గ్రామంలో శ్రీలక్ష్మీనర్సింహ యోగానందస్వామి ఉత్సవాల్లో భాగంగా శనివారం అంతర్రాష్ట్ర బండలాగుడు పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో నాగర్‌కర్నూల్‌ జిల్లా యాదిరెడ్డిపల్లికి చెందిన అఖిలేష్‌రెడ్డి వృషభాలు ప్రథమస్థానంలో నిలిచాయి. మొదటి బహుమతిగా రూ.40 వేల నగదు నిర్వాహకులు అందజేశారు. అదేవిధంగా చిన్నంబావి మండలం పెద్దదగడకు చెందిన గోపాలకృష్ణ ఎద్దులు రెండో స్థానంలో నిలవగా రూ.30 వేలు, మూడోస్థానంలో నిలిచిన నల్లగొండ జిల్లా కొప్పోల్‌ సత్యనారాయణ ఎద్దులకు రూ.20 వేలు, నాలుగో స్థానంలో నిలిచిన పెబ్బేరు ఎం.బాలరాజు ఎద్దులకు రూ.15 వేలు, ఐదోస్థానంలో నిలిచిన పాన్‌గల్‌ మండలం దావాజిపల్లికి చెందిన ఉనిద్యాల విష్ణు ఎద్దులకు రూ.10 వేలు, ఆరోస్థానంలోని పెబ్బేర్‌ మండలం గుమ్మడం గ్రామానికి చెందిన నీతుల నరసింహనాయుడు ఎద్దులకు రూ.5 వేల నగదు అందజేశారు. పోటీలను ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పూజలు చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో మండల నాయకులు రవీందర్‌రెడ్డి, క్యామ వెంకటయ్య, వెంకటేశ్వర్‌రావు, సాయిచరణ్‌రెడ్డి, బాలకృష్ణారెడ్డి, క్యామ రాజు, శేఖర్‌రెడ్డి, ఆగారం ప్రకాష్‌, రవినాయక్‌, బాల్‌రెడ్డి, రమేష్‌గౌడ్‌, ఖలీల్‌, వివిధ గ్రామాల నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

రామన్‌పాడులో

తగ్గుతున్న నీటిమట్టం

మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో శనివారం పూర్తిస్థాయి నీటిమట్టం 1,015 అడుగులు ఉన్నట్లు ఏఈ వరప్రసాద్‌ తెలిపారు. జూరాల ఎడమ కాల్వలో 270 క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా.. సమాంతర కాల్వలో నీటి సరఫరా లేదని చెప్పారు. ఇదిలా ఉండగా జలాశయం నుంచి ఎన్టీఆర్‌ కాల్వకు 36 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వకు 34 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని వివరించారు.

అంతర్రాష్ట్ర బండలాగుడు పోటీలు 
1
1/1

అంతర్రాష్ట్ర బండలాగుడు పోటీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement