జూన్‌ 1 వరకు జత యూనిఫాంలు అందించాలి | - | Sakshi
Sakshi News home page

జూన్‌ 1 వరకు జత యూనిఫాంలు అందించాలి

Apr 18 2025 12:40 AM | Updated on Apr 18 2025 12:40 AM

జూన్‌ 1 వరకు జత యూనిఫాంలు అందించాలి

జూన్‌ 1 వరకు జత యూనిఫాంలు అందించాలి

ఖిల్లాఘనపురం: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు జూన్‌ 1 వరకు జత యూనిఫాంలను అందించాలని జిల్లా కోఆర్డినేటర్‌ యుగేందర్‌ అన్నారు. గురువారం స్థానిక ఎమ్మార్సీలో నిర్వహించిన హెచ్‌ఎంల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా 2025– 26 విద్యా సంవత్సరానికి గాను విద్యార్థులకు అవసరమైన యూనిఫాంలకు సంబంధించిన వస్త్రాన్ని మండల సమాఖ్యకు అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో 1 నుంచి 10వ తరగతి వరకు మొత్తం 3,537 మంది విద్యార్థులు ఉన్నారని, విద్యాశాఖ ఆదేశాల ప్రకారం మండల సమాఖ్యకు యూనిఫాంలకు కావాల్సిన వస్త్రాలను అప్పగించామన్నారు. వెంటనే కుట్టు పనులు మొదలుపెట్టి జూన్‌ 1 నాటికి విద్యార్థులకు ఒక జత ఇచ్చేలా చూడాలని ఏపీఎం రాంబాబుకు సూచించారు. విద్యార్థులకు కొలతల ప్రకారం చక్కగా కుట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో ఎంఈఓ జయశంకర్‌, క్లస్టర్‌ హెచ్‌ఎం కాళిదాసు, ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement