
పది నెలల కిందటే చెల్లించాను..
ప్రభుత్వం రాయితీపై అందించే స్ప్రింక్లర్ల కోసం 10 నెలల కిందట డీడీ ఇచ్చాను. రాలేదని తెలిసి అధికారులను ప్రశ్నించగా.. రాష్ట్రవ్యాప్తంగా గిరిజన కోటా పూర్తి కావడంతో జిల్లాలో ఎవరికీ మంజూరు కాలేదని సమాధానమిచ్చారన్నారు. అధికారులు స్పందించి స్ప్రింక్లర్లను మంజూరు చేయాలి.
– గోపాల్, రైతు, నాగమ్మతండా, వనపర్తి
అధికారుల నిర్లక్ష్యమే..
స్ప్రింక్లర్లకు దరఖాస్తు చేసుకోవాలని ఉద్యానశాఖ ప్రకటన ఇచ్చిన వెంటనే తమవంతు చెల్లించాల్సిన డబ్బులను డీడీ రూపంలో దరఖాస్తుకు జత చేశాం. మంజూరులో అధికార, పాలకవర్గంలో చోటు చేసుకున్న ఆలస్యంతో మాకు ఎలాంటి సంబంధం లేదు. అధికారులు స్పందించి స్ప్రింక్లర్లు మంజూరు చేయాలి.
– గోవింద్, రైతు, నాగమ్మతండా, వనపర్తి
రానున్న యాక్షన్ ప్లాన్లో
తొలి ప్రాధాన్యం..
రాష్ట్రవ్యాప్తంగా ఎస్టీ కేటగిరీకి ఇవ్వాల్సిన కోట పూర్తి కావడంతో గిరిజన రైతులకు ఇవ్వలేకపోయాం. రానున్న యాక్షన్ ప్లాన్లో వారికి తొలి ప్రాధాన్యం ఇస్తాం. అర్హులైన గిరిజన రైతులందరికీ మంజూరు చేసేందుకు ప్రయత్నిస్తాం. ఇప్పటి వరకు జిల్లా రైతులకు మంజూరైన స్ప్రింక్లర్లను 15వ తేదీ లోపు పంపిణీ చేస్తాం.
– విజయభాస్కర్రెడ్డి, జిల్లా ఉద్యాన అధికారి
●

పది నెలల కిందటే చెల్లించాను..

పది నెలల కిందటే చెల్లించాను..