రామతీర్థం హుండీల ఆదాయం రూ.29.96 లక్షలు | - | Sakshi
Sakshi News home page

రామతీర్థం హుండీల ఆదాయం రూ.29.96 లక్షలు

May 29 2025 1:21 AM | Updated on May 29 2025 1:25 AM

నెల్లిమర్ల రూరల్‌: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో హుండీల ఆదాయాన్ని దేవస్థానం అధికారులు బుధవారం లెక్కించారు. మొత్తం 89 రోజులకు గాను దేవాలయంలో ఉన్న హుండీల ద్వారా రూ.29,76,730 ఆదాయం సమకూరిందని ఈఓ వై శ్రీనివాసరావు తెలిపారు. హుండీల లెక్కింపును దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్‌లు రాజకుమారి, చీపురుపల్లి కనకమహాలక్ష్మి, దేవస్థానం ఈఓ శ్రీనివాస్‌ దగ్గరుండి పర్యవేక్షించారు. లెక్కింపులో అవాంఛనీయ ఘటనలు జరగకుండా స్థానిక పోలీసులు బందోబస్తు నిర్వహించారు. జిల్లాకు చెందిన పలువురు శ్రీవారి సేవా భక్తులు హుండీల ఆదాయ లెక్కింపులో పాల్గొన్నారు.

సారా కేసుల్లో నలుగురి అరెస్ట్‌

గుమ్మలక్ష్మీపురం(కురుపాం)/జియ్యమ్మవలస రూరల్‌: కురుపాం ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ ఆధ్వర్యంలో బుధవారం జియ్యమ్మవలస మండలం చినమేరంగి, చినదొడిజ గ్రామాల్లో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సారా కలిగిఉన్న ముగ్గురు వ్యక్తులతో పాటు సారా వండేందుకు ముడిసరుకులు సరఫరా చేసిన మరో వ్యక్తిని అరెస్ట్‌ చేసినట్లు కురుపాం ఎకై ్సజ్‌ సీఐ పి.శ్రీనివాసరావు తెలిపారు. దాడుల్లో భాగంగా చినదొడిజ గ్రామ పరిసరాల్లో 400 లీటర్ల పులిసిన బెల్లపు ఊటను గుర్తించి ధ్వంసం చేశామన్నారు. దాడుల్లో ఆయన వెంట ఎ కై ్సజ్‌ ఎస్సై జె.రాజశేఖర్‌, సిబ్బంది ఉన్నారు.

ఆర్టీసీ డ్రైవర్‌ ఆత్మహత్య

సాలూరు రూరల్‌: పట్టణానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్‌ రెడ్డి అప్పలస్వామి బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..స్థానిక రామాకాలనీలో నివాసముంటున్న అప్పలస్వామి (58) అనారోగ్య కారణంతో మనస్తాపానికి గురై ఆర్‌టీసీ కాంప్లెక్స్‌ మేడపై ఉరివేసుకున్నాడు. ఈ మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ బి.అప్పలనాయుడు తెలిపారు.

పురుగు మందు తాగి మహిళ..

గుర్ల: మండలంలోని పాలవసలకు చెందిన కోడి సూర్యకాంతం(45) పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే కొద్దిరోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతోంది, ఆ బాధను భరించలేక మూడు రోజుల క్రితం పురుగు మందు తాగేసింది. అనంతరం అపస్మాకర స్థితిలో ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. గుర్ల పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

రామతీర్థం హుండీల ఆదాయం రూ.29.96 లక్షలు1
1/3

రామతీర్థం హుండీల ఆదాయం రూ.29.96 లక్షలు

రామతీర్థం హుండీల ఆదాయం రూ.29.96 లక్షలు2
2/3

రామతీర్థం హుండీల ఆదాయం రూ.29.96 లక్షలు

రామతీర్థం హుండీల ఆదాయం రూ.29.96 లక్షలు3
3/3

రామతీర్థం హుండీల ఆదాయం రూ.29.96 లక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement