కళాక్షేత్రాన్ని సందర్శించిన మాజీ ఎంపీ బెల్లాన | - | Sakshi
Sakshi News home page

కళాక్షేత్రాన్ని సందర్శించిన మాజీ ఎంపీ బెల్లాన

May 1 2025 1:21 AM | Updated on May 1 2025 1:21 AM

కళాక్

కళాక్షేత్రాన్ని సందర్శించిన మాజీ ఎంపీ బెల్లాన

రాజాం: పట్టణంలోని వస్త్రపురికాలనీ సమీపంలో ఎంపీ ల్యాడ్స్‌ నిధులతో నిర్మించిన జీఎంఆర్‌ వరలక్ష్మీ కళా క్షేత్రాన్ని మాజీ ఎంపీ బెల్లాన చంద్రశశేఖర్‌ బుధవారం సందర్శించారు. గత ప్రభుత్వ హయాంలో కళాకారుల కోసం కళాక్షేత్ర భవన నిర్మాణానికి అప్పటి ఎంపీ బెల్లాన నిధులు సమకూర్చారు. అక్కడి స్థలాన్ని జీఎంఆర్‌ ఉచితంగా అందజేసింది. కళాక్షేత్రం నిర్మాణం పూర్తికావడంతో క్షేత్రాన్ని సందర్శించడంతో పాటు కళాకారులతో కలిసి పూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో పద్మశ్రీ యడ్ల గోపాలరావు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజాం పట్టణ అధ్యక్షుడు పాలవలస శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

స్పందించిన సర్వజన ఆస్పత్రి వైద్యాధికారులు

విజయనగరం ఫోర్ట్‌: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఎక్స్‌రే ఫిల్మ్‌లు లేక ఎం.ఎల్‌.సి రోగులు అవస్థలు పడుతున్న అంశంపై ‘ఎంఎల్‌సీ రోగులకు తిప్పలు’ అనే శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తకు ఆస్పత్రి వైద్యాధికారులు స్పందించారు. ప్రస్తుతం ఉన్న ఎక్సరే, సిటీ, ఎంఆర్‌ఐ ఫిల్మ్‌లు రోగులకు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సంబంగి అప్పలనాయుడు తెలిపారు.

ఐటీఐ విద్యార్థులకు అప్రెంటిస్‌ అవకాశాలు

విజయనగరం అర్బన్‌: జిల్లాలో ఐటీఐ కోర్సులు పాసైన విద్యార్థులకు మైలాన్‌ లేబొరేటరీ పరిశ్రమలో అప్రెంటిస్‌ కల్పించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని విజయనగరం ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్‌ టీవీగిరి ఒక ప్రకటనలో తెలిపారు. ఐటీఐలో ఎలక్ట్రీషియన్‌/ఫిట్టర్‌ కోర్సులు పాసైన విద్యార్థులకు విజయనగరం బయోటెక్‌లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ 2వ తేదీన కన్వీనర్‌ ప్రభుత్వ ఐటీఐ విజయనగరం కార్యాలయానికి ధ్రువపత్రాలతో హాజరుకావాలని కోరారు. పూర్తి వివరాల కోసం సెల్‌: 98491 18075 నంబర్‌ను సంప్రదించాలన్నారు.

నేడు కార్మికులకు సెలవు

విజయనగరం గంటస్తంభం: ప్రపంచ కార్మి క దినోత్సవం (మే డే) రోజున కార్మికులకు సెలవు దినంగా ప్రకటించాలి. ఒకవేళ యజమానులు ఆ రోజున పనిచేయించుకుంటే 30 రోజులలోపు ఏదో ఒకరోజు సెలవు ఇవ్వాలి. ఆ రోజుకు రెట్టింపు వేతనం కార్మికులకు ఇవ్వా ల్సి ఉంటుందని కార్మికశాఖ జిల్లా ఉప కమిషనర్‌ ఎస్‌.డి.వి.ప్రసాదరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

డైట్‌ కాలేజీలు తెరిపించండి

విజయనగరం అర్బన్‌: మూతపడిన ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలు (డైట్‌) తిరిగి తెరిపించాలని బీఈడీ, డైట్‌ కాలేజీల అసోసియేషన్‌ ప్రతినిధులు కోరారు. తోటపాలెంలో ఓ ప్రైవేటు కాలేజీలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ డాక్టర్‌ గాదె శ్రీనివాసుల నాయుడుకి వినతిపత్రం అందజేశారు. ఉపాధ్యాయ వృత్తి విద్యను ప్రోత్సహించాలన్నారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీని కలిసిన వారిలో అసోసియేషన్‌ ప్రతినిధులు డాక్టర్‌ శ్రీనివాస్‌ మోహన్‌, డాక్టర్‌ అప్పలనాయుడు, రాఘవ కుమార్‌, పీఆర్‌టీయూ నాయుకులు డి.శ్రీనివాస్‌, బంకపల్లి శివప్రసాద్‌, రామకృష్ణ, మోహన్‌, తదితరులు ఉన్నారు.

కళాక్షేత్రాన్ని సందర్శించిన మాజీ ఎంపీ బెల్లాన 1
1/3

కళాక్షేత్రాన్ని సందర్శించిన మాజీ ఎంపీ బెల్లాన

కళాక్షేత్రాన్ని సందర్శించిన మాజీ ఎంపీ బెల్లాన 2
2/3

కళాక్షేత్రాన్ని సందర్శించిన మాజీ ఎంపీ బెల్లాన

కళాక్షేత్రాన్ని సందర్శించిన మాజీ ఎంపీ బెల్లాన 3
3/3

కళాక్షేత్రాన్ని సందర్శించిన మాజీ ఎంపీ బెల్లాన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement