ఇరువర్గాలపై కొట్లాట కేసు నమోదు | - | Sakshi
Sakshi News home page

ఇరువర్గాలపై కొట్లాట కేసు నమోదు

Apr 28 2025 12:19 AM | Updated on Apr 28 2025 12:19 AM

ఇరువర్గాలపై కొట్లాట కేసు నమోదు

ఇరువర్గాలపై కొట్లాట కేసు నమోదు

సంతకవిటి: మండలంలోని గుళ్లసీతారాంపురం గ్రామంలో శనివారం రాత్రి జరిగిన కొట్లాటలో ఇరువర్గాల వారి పరస్పర ఫిర్యాదుల మేరకు రెండు కేసులు నమోదు చేశామని ఎస్సై ఆర్‌.గోపాలరావు తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం 15 రోజుల క్రితం పక్కపక్క పొలాలు గల ముగడ సూర్యనారాయణ పొలం గట్టుపై ఉన్న చెట్టును కొల్లి మురళి కొట్టడంతో ఇరు కుటుంబాల మధ్య మాటామాట పెరిగి శనివారం రాత్రి కొట్లాట జరిగింది. ఈ కొట్లాటలో 9 మందికి గాయాలవడంతో ముగడ గణేష్‌ వైజాగ్‌ కేజీహెచ్‌లో, ముగడ సూర్యనారాయణ, ముగడ రామకృష్ణ, ముగడ సత్యంలు, కె.బంగార్రాజులు శ్రీకాకుళం రిమ్స్‌ ఆస్పత్రిలో, కొల్లి శ్రీను, కొల్లి పవన్‌, కొల్లి మణికంఠలు రాజాంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నా రు. ఆదివారం ముగడ రామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మురకు 13 మందిపై, కొల్లి పవన్‌కుమార్‌ ఇచ్చిన ఫి ర్యాదు మేరకు ఏడుగురిపై కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆర్‌.గోపాలరావు తెలిపా రు. శ్రీకాకుళం రిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతు న్న బాధితులను సంతకవిటి ఎస్సైతో కలిసి రాజాం రూరల్‌ సీఐ హెచ్‌.ఉపేంద్రరావు పరామర్శించి కొ ట్లాటకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement