ఆ కేసులు న్యాయస్థానంలో నిలవవు | - | Sakshi
Sakshi News home page

ఆ కేసులు న్యాయస్థానంలో నిలవవు

Apr 27 2025 1:17 AM | Updated on Apr 27 2025 1:17 AM

ఆ కేస

ఆ కేసులు న్యాయస్థానంలో నిలవవు

మంత్రివి మాయమాటలు..

ఇటీవల జిల్లాలో పర్యటించిన రాష్ట్ర జలవనరుల శాఖమంత్రి నిమ్మల రామానాయుడు ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని పూర్తిచేసి గోదావరి జలాలను జిల్లాకు తీసుకొస్తామంటూ ప్రజలను అమాయకులను చేసి మాయమాటలు చెబుతున్నారు. పోలవరం స్టోరేజీ కెపాసిటీ ఎత్తు తగ్గించి ఇప్పుడు ఆ ప్రాజెక్టును ఎలా పూర్తి చేస్తారు?. ఇప్పటి వరకు బడ్జెట్‌లో కనీసం నిధులు కేటాయించారా..? అధికారులతో సమీక్ష నిర్వహించారా...? భూసేకరణ పూర్తి చేశారా...? ఇవేమి జరగకుండా జిల్లా ప్రజలకు అబద్ధాలు చెబుతున్నారు. తారక రామతీర్థసాగర్‌ ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తయ్యాయని చెప్పిన మంత్రి మిగిలిన 10 శాతం పనులు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలి. తోటపల్లి మిగులు పనులు పూర్తి చేసి చివరి ఆయకట్ట వరకు నీరు అందించే దిశగా కృషి చేయాలి.

కొత్త పింఛన్లు ఇస్తున్నామంటూ మంత్రి మాయ మాటలు

ఇప్పటి వరకు పింఛన్లు తీసుకుంటూ చనిపోయిన

భర్తల స్థానంలో భార్యలకు మాత్రమే పింఛన్లు

ఒక్క కొత్త పింఛన్‌ కూడా మంజూరు చేయలేదు

మత్స్యకారులకు రెండేళ్లకు రూ. 40 వేల భృతి చెల్లించాలి

ఉత్తరాంధ్ర సుజల స్రవంతిపై మంత్రి నిమ్మలవి

మోసకారి ప్రకటనలు

ఎన్నికలకు ముందు చేసిన హామీలు అమలుపై

ప్రజా పోరాటం చేస్తాం

జెడ్పీచైర్మన్‌, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు

చెల్లూరులో ఆటోనగర్‌ ఏర్పాటు చేయండి

విజయనగరం జిల్లా కేంద్రానికి సమీపంలో చెల్లూరులో ఆటోనగర్‌ ఏర్పాటు చేయాలి. ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలో స్థల సేకరణ పూర్తయింది. తాజాగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ గజపతినగరంలో ఆటోనగర్‌ ఏర్పాటుచేస్తామంటూ ప్రకటించారు. అక్కడ కాకుండా ఇప్పటికే గుర్తించిన స్థలంలో ఆటోనగర్‌ ఏర్పాటు చేస్తే ప్రక్రియ సులభతరం అవుతుంది. జిల్లాలో మూతపడుతున్న జిందాల్‌, ఫెర్రో ఎల్లాయిస్‌ కంపెనీలను తెరిపించి కార్మికులకు న్యాయం చేయాలి. జిల్లాలో మూతపడుతున్న పరిశ్రమలపై దృష్టి సారిస్తే బాగుంటుందని జెడ్పీ చైర్మన్‌ అన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ వర్రి నర్సింహమూర్తి, వైఎస్సార్‌సీపీ జిల్లా ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు పీరుబండి జైహింద్‌ కుమార్‌, జిల్లా ప్రచార కమిటీ కన్వీనర్‌ వలిరెడ్డి శ్రీనివాసరావు, చీపురుపల్లి మండల పార్టీ అధ్యక్షుడు మీసాల వరహాలనాయుడు పాల్గొన్నారు.

విజయనగరం:

ధికారమే పరమావధిగా ఎన్నికలకు ముందు గుప్పించిన హమీలను విస్మరించిన కూటమి ప్రభుత్వం మోసకారి మాటలు చెబుతూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని విజయనగరం జిల్లా పరిషత్‌ చైర్మన్‌, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు అన్నారు. సూపర్‌సిక్స్‌ పేరిట ప్రజలను నమ్మించి ఓట్లు దండుకున్న వారు ఆ హమీలు అమలు చేయకపోవడంపై మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ప్రకటించిన హమీల అమలు చేయాలన్న డిమాండ్‌తో ప్రజాపోరాటం చేస్తామని, ప్రజలకు అండగా వైఎస్సార్‌సీపీ నిలుస్తుందని స్పష్టం చేశారు. జెడ్పీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయన మాటల్లోనే..

కొత్త పింఛన్లు ఏవీ..

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా ఒక్క హమీ సక్రమంగా అమలు చేయలేదు. తాజాగా జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అర్హులైన వారికి కొత్త పింఛన్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అవి కొత్త పింఛన్లు ఎలా అవుతాయి. ఇప్పటికే పింఛన్లు పొందుతున్న భర్తలు చనిపోతే వారి స్థానంలో భార్యలకు మాత్రమే వితంతు పింఛ న్లు ఇస్తున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 89,788 పింఛన్‌దారులున్నారు. జిల్లా వరకు 4,400 మంది లబ్ధిదారులున్నారు. ఇవన్నీ బదిలీ పింఛన్లు మాత్రమే. పాత పింఛన్లు లెక్కలోకే వస్తాయి. కొత్తగా కూటమి ప్రభుత్వం ఒక్క కొత్త పింఛను మంజూరు చేయకుండా ప్రజలను మోసగించే ప్రయత్నం చేయడం దురదృష్టకరం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా 65.94 లక్షల పింఛన్లు ఉండేవి. ఇప్పుడు ఆ సంఖ్య 63.92 లక్షలకు తగ్గిపోయింది. సుమారు 1.57 లక్షల పింఛన్లు తగ్గిపోయాయంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. ఈ వాస్తవాలన్నీ ప్రజలు అర్ధం చేసుకుంటున్నారు. 2024 జనవరి 1 నుంచి 60 ఏళ్లలోపు వయస్సు గల భర్త చనిపోతే ఆ భార్యకు కొత్త పింఛను మంజూరు చేయడం లేదు. 60 ఏళ్లు పైబడిన వారికి, కొత్తగా దివ్యాంగత్వం కలిగిన వారికి పింఛన్లు ఒక్కటైనా ఈ ప్రభుత్వం మంజూరు చేసిందా...? కనీసం దరఖాస్తు చేసుకునేందుకు వెబ్‌సైట్‌ ప్రారంభించలేదు. ఎన్నికల హమీల్లో ప్రకటించిన 50 ఏళ్లు పైబడిన వారికి పింఛను మంజూరు ఊసేలేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకొకసారి వచ్చిన దరఖాస్తులు పరిశీలించి అర్హులైన వారికి రాజకీయాలకు అతీతంగా పింఛన్లు మంజూరు చేసింది. ఓట్లేసి గెలిపించిన ప్రజల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే బకాయిలతో కలిపి పింఛన్‌ మొత్తం చెల్లించాలి.

● మత్స్యకారులకు రూ.40వేల భృతి చెల్లించాలి

సముద్రంలో వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు చెల్లించాల్సిన భృతిని గడిచిన రెండేళ్లకు సంబంధించి రూ.40వేల చొప్పున చెల్లించాలి. 2024 జూన్‌లో కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టింది. ఆ సంవత్సరానికి సంబంధించిన భృతిని ఎగ్గొట్టే చర్యలు తగవు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2019 సంవత్సరానికి సంబంధించిన మత్స్యకార భృతిని నవంబర్‌ నెలలో విడుదల చేశారు.

రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తోంది. కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వైఎస్సార్‌సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తోంది. అవి న్యాయ స్థానంలో నిలబడవు. గత ప్రభుత్వ హయాంలో లిక్కర్‌ పాలసీలో అక్రమాలు జరిగాయంటూ కేసులు పెడుతున్నారు. ప్రభుత్వమే షాపులు నిర్వహించినప్పుడు అక్రమాలకు ఆస్కారం ఎలా ఉంటుంది..?

ఆ కేసులు న్యాయస్థానంలో నిలవవు 1
1/1

ఆ కేసులు న్యాయస్థానంలో నిలవవు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement