44 కేజీల గంజాయి స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

44 కేజీల గంజాయి స్వాధీనం

Apr 27 2025 1:17 AM | Updated on Apr 27 2025 1:17 AM

44 కే

44 కేజీల గంజాయి స్వాధీనం

పార్వతీపురం రూరల్‌: రాయగడ నుంచి తమిళనాడుకు అక్రమంగా తరలిస్తున్న 44 కేజీల గంజాయిని పార్వతీపురం పట్టణం శివారు రాయగడ రోడ్డులోని పెట్రోల్‌బంకు సమీపంలో పట్టుకున్నట్టు పార్వతీపురం పట్టణ సీఐ కె. మురళీధర్‌ శనివారం తెలిపారు. తమిళనాడు రిజిస్టేషన్‌తో ఉన్న కారులో ఆరుగురు వ్యక్తులు 44 కేజీల గంజాయిని తరలిస్తున్నారన్న ముందస్తు సమాచారం మేరకు ఎస్‌ఐ గోవింద సిబ్బందితో కలిసి దాడిచేశారన్నారు. సుమారు రూ.5లక్షల విలువైన గంజాయితో పాటు ఆరుగురిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నామన్నారు.

దినసరి వేతనం పెరిగేలా చూడాలి

కలెక్టర్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌

విజయనగరం ఫోర్ట్‌: ఉపాధిహామీ వేతనదారులకు దినసరి వేతనం పెరిగేలా చూడాలని కలెక్టర్‌ డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ ఆడిటోరియంలో శనివారం ఉపాధి హామీ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వేసవి కాలంలో ఎండ తీవ్రత లేని సమయంలో పనులు నిర్వహించాలని తెలిపారు. రెండు పూటలా కనీసం 6 గంటలు పనిచేసేలా చూడాలని ఆదేశించారు. వేతనదారులు వడదెబ్బకు గురికాకుండా తగిన జాగ్రత్తలను తీసుకోవాలని, తాగునీరు, నీడ ఏర్పాటు చేయాలని సూచించారు. జలవనరులను పెంచే ఫారం పాండ్స్‌, పూడిక తీత పనులకు ప్రాధాన్యమివ్వాలన్నారు. పనుల్లో పురోగతి చూపించని సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో డ్వామా పీడీ ఎస్‌.శారదాదేవి పాల్గొన్నారు.

44 కేజీల గంజాయి స్వాధీనం 1
1/1

44 కేజీల గంజాయి స్వాధీనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement