క్షణికావేశం వద్దు .. జీవితమే ముద్దు | - | Sakshi
Sakshi News home page

క్షణికావేశం వద్దు .. జీవితమే ముద్దు

Apr 22 2025 1:01 AM | Updated on Apr 22 2025 1:01 AM

క్షణి

క్షణికావేశం వద్దు .. జీవితమే ముద్దు

ఈ విషయాలు మరువొద్దు..

● ఫలితాలు ఎలా వచ్చినా.. విద్యార్థులు పాజిటివ్‌గా తీసుకోవాలి. కుటుంబం, స్నేహితులు, అధ్యాపకులు, చుట్టుపక్కల వారు ప్రవర్తించే తీరు విద్యార్థులపై ప్రభావం చూపుతుంది.

● ప్రధానంగా క్షణికావేశానికి గురికాకూడదు. తొందరపాటుగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. తమలోని బాధను పంచుకోవడంతో పాటు నెగిటివ్‌ ఆలోచనలను దూరం పెట్టాలి.

● సభ్యులు, స్నేహితులు, చుట్టు పక్కల వారు ఫెయిలైన విద్యార్థులపై చులకన భావంతో ఉండకూడదు. ఎగతాలి చేసినట్టు మాట్లాడొద్దు.

● చదువుతున్నప్పుడు తల్లిదండ్రులు, స్నేహితులు ఎలాంటి ప్రోత్సాహం అందిస్తారో, ఫెయిలైతే అదే స్థాయిలో వెన్నుతట్టి ప్రోత్సహించాలి.

● ఫెయిలైనా జీవితంలో విజేతలుగా నిలిచిన వారి గురించి తెలియజేయాలి. ఎన్ని చెప్పినా విద్యార్థులు మానసికంగా ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

● ప్రతిభకు మార్కులు కొలమానం కాదు ● పరీక్షలే సర్వస్వం అనుకోవద్దు

● తల్లిదండ్రులు దండించొద్దు.. ధైర్యం చెప్పాలి ● ముందుంది మంచి జీవితం

రామభద్రపురం:

రీక్షలో మంచి ర్యాంకు రాలేదని కొందరు.. మార్కులు తక్కువ వచ్చాయని ఇంకొందరు.. ఫెయిల్‌ అయ్యామని మరికొందరు క్షణికావేశానికి గురవుతారు. ర్యాంకు, మార్కులను పక్కవారితో పోల్చుకుని మనస్థాపం చెందుతారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. ఇవి సరికాదన్నది మేధావుల మాట. విద్యార్థి ప్రతిభకు మార్కులు గీటురాయి కాదు. మార్కులు ఆధారంగా తెలివితేటలు అంచనావేయడం సరైనది కాదన్నది విద్యావేత్తలే చెబుతున్నారు. పిల్లల మార్కులను తల్లిదండ్రులు ప్రతిష్టంగా భావించడం తప్పు. ప్రపంచంలోని మేధావులంతా ఎక్కువ మార్కులు సాధించిన వారేంకాదు. విద్యా సంస్థల యాజమాన్యాలు మార్కులు వెంట పరుగెత్త కూడదు. పరీక్షలే సర్వస్వం కాదు. జీవితం ఎంతో ఉందని విద్యావేత్తలు, వైద్యాధికారులు, ఉన్నత స్థాయిలో ఎదిగిన వారు సూచిస్తున్నారు. చదువులో రాణించలేనివారు సాంకేతిక, వ్యాపార, వ్యవ సాయ, క్రీడా రంగాల్లో రాణిస్తున్నారన్నది సత్యం. అందుకే ముందున్నది మంచికాలం అని భుజం తట్టాలి. ఫెయిలైన సమయంలో తల్లిదండ్రులు ధైర్యం చెప్పాలి. అండగా నిలబడాలన్నది మానసిక నిపుణుల మాట. పదోతరగతి ఫలితాలు ఈ నెల 23న విడుదల కానున్నట్టు సమాచారం. జిల్లా వ్యాప్తంగా 447 ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలలకు చెందిన 22,939 మంది, గతంలో ఫెయిలైన విద్యార్థులు 835 మంది మొత్తంగా 23,774 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఈ పరీక్షల్లో పొరపాటున ఫెయిలైతే దండించవద్దు.. ధైర్యం చెప్పాలని తల్లిదండ్రులకు విద్యావేత్తలు ఇస్తున్న సూచన.

క్షణికావేశం వద్దు .. జీవితమే ముద్దు 1
1/1

క్షణికావేశం వద్దు .. జీవితమే ముద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement