
●శిశువు మృతిపై విచారణ
శృంగవరపుకోట: మండలంలోని ధారపర్తి పంచాయతీ చిలకపాడు గ్రామానికి చెందిన ఏడాది వయస్సున్న బాలుడు జన్ని విజయ్ మృతిపై డీఐవో అచ్యుతకుమారి మంగళవారం విచారణ జరిపారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి బాలుడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. వైద్యారోగ్యశాఖ సిబ్బంది స్థానికంగా ఉండడం లేదని, సకాలంలో వైద్యం అందక మరణాలు సంభవిస్తున్నాయని గిరిజన యువకులు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆమె స్పందిస్తూ విచారణ జరిపి వివరాలు డీఎంహెచ్ఓకు సమర్పిస్తామన్నారు. ఆమె వెంట కొట్టాం పీహెచ్సీ వైద్యాధికారి హారిక, హెచ్ఈఈ రత్నకుమారి, ఏఎస్ఓ మురళి ఉన్నారు.