15న కుస్తీ ఎంపిక పోటీలు | - | Sakshi
Sakshi News home page

15న కుస్తీ ఎంపిక పోటీలు

Dec 11 2023 12:34 AM | Updated on Dec 11 2023 12:34 AM

వైఎస్‌ జగన్‌ అభిమాని జయకుమార్‌ యాత్రకు మద్దతు తెలుపుతున్న 
వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు  - Sakshi

వైఎస్‌ జగన్‌ అభిమాని జయకుమార్‌ యాత్రకు మద్దతు తెలుపుతున్న వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు

నెల్లిమర్ల రూరల్‌: మండలంలోని కొండగుంపాం గ్రామంలో ఈ నెల 15న కుస్తీ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నామని కుస్తీ అసోసియేష న్‌ జిల్లా కార్యదర్శి పతివాడ లక్ష్మణరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 26, 27 తేదీల్లో చిత్తూరు జిల్లాలో రాష్ట్ర చాంపియన్‌ షిప్‌ పోటీలు జరగనున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా స్థాయిలో ఎంపిక లు నిర్వహిస్తున్నామని ఆసక్తి గల క్రీడాకారులు ఈ నెల 15న ఉదయం 8 గంటలకు కొండగుంపాం గ్రామానికి చేరుకోవాలన్నారు. పూర్తి వివ రాలకు 98486 20959 నంబరును సంప్రదించాలని సూచించారు.

దివ్యాంగులను ఆర్థిక

స్థితిమంతులుగా తీర్చిదిద్దాలి

కేంద్ర విజిలెన్స్‌ మాజీ కమిషనర్‌ చౌదరి

కొత్తవలస : దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలను సమకూర్చడంతో పాటు వారిని ఆర్థిక స్థితిమంతులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని కేంద్ర విజిలెన్స్‌ మాజీ కమిషనర్‌ కేవీ చౌదరి అన్నారు. మండలంలోని మంగళపాలెం గ్రామ సమీపంలో గల శ్రీగురుదేవా చారిటబుల్‌ ట్రస్టు చైర్మన్‌ రాపర్తి జగదీష్‌బాబు అధ్యక్షతన ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 700 మందికి దుప్పట్లు, 50 మంది దివ్యాంగులకు వీల్‌చైర్స్‌, ట్రైసైకిళ్లు, కృత్రిమ అవయవాలు తదితర సామగ్రిని కేవీ చౌదరి అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దివ్యాంగులు ఆర్థికంగా ఎదిగిన రోజు మరొకరిపై ఆధారపడాల్సిన అవసరం ఉండదని, వారిలో ఆత్మస్థైర్యం పెరుగుతుందన్నారు. అందుకు తగ్గ సహకారం గురుదేవా చారిటబుల్‌ ట్రస్టు ద్వారా అందుతోందన్నారు. సాయం పొందిన వారు మరొకరికి సాయం చేసే స్థాయికి ఎదగా లని సూచించారు. ట్రస్టు చైర్మన్‌ జగదీష్‌బాబు మాట్లాడుతూ తమ ట్రస్టు ద్వారా ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, చత్తీస్‌ఘడ్‌, తెలంగాణ, కర్నాటక రా ష్ట్రాల్లో సేవలు అందజేస్తున్నామని తెలిపారు. సుమారు లక్షా 18 వేల మంది దివ్యాంగులకు కృత్రిమ అవయవాలను అందించామన్నారు. స్టీల్‌ ఎక్ఛేంజి ఇండియా లిమిటెడ్‌ సీఎండీ బండి సురేష్‌కుమార్‌ మాట్లాడుతూ గురుదేవా ట్ర స్టు సేవలు నిరూపమన్నారు. ట్రస్టుకు తమ కర్మాగారం నుంచి పూర్తిగా సహకరిస్తామన్నా రు. ఓఎన్‌జీసీ మాజీ అధికారి అరుమగం, ప్రముఖ వైద్యుడు ఆనందకృష్ణ పాల్గొన్నారు.

జగనే మళ్లీ సీఎం కావాలని

సంకల్ప యాత్ర

ఆటోతో యాత్ర చేపట్టిన జగన్‌ వీరాభిమాని జయకుమార్‌

విజయనగరం రూరల్‌: సంక్షేమ ప్రధాత, అభివృద్ధి కారకులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ సీఎం కావాలని ప్రకాశం జిల్లా నాలుగుప్పలపాడు మండలం ఈదుముడి గ్రా మానికి చెందిన కావూరి జయకుమార్‌ ఆటోతో సంకల్ప యాత్ర చేపట్టారు. దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి సమాధి నుంచి కొద్ది రోజుల కిందట ప్రారంభమైన ఈ యాత్ర ఆదివారం విజయనగరం చేరుకుంది. 100 రోజుల ఈ యాత్ర ఈనెల 21న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో నిర్మించిన విజయస్థూపం(పైలాన్‌) వద్ద ముగుస్తుందని జయకుమార్‌ తెలిపారు. యాత్రలో భాగంగా విజయనగరం వచ్చిన ఆయన జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ శ్రేణులు ఆయనకు మద్దతు తెలిపాయి.

జాతీయస్థాయి ఖోఖో పోటీలకు జొన్నవలస విద్యార్థి

విజయనగరం రూరల్‌: జొన్నవలస జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఎనిమి దో తరగతి విద్యార్థి జాతీ య స్థాయి సబ్‌ జూనియర్‌ ఖోఖో పోటీలో పాల్గొనే రాష్ట్ర జట్టులో స్థానం సంపాదించాడు. గత నెల 26 నుంచి 28 వరకు గుంటూరులో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో విజయనగరం జిల్లా జట్టు తృతీ య స్థానం సాధించింది. జిల్లా జట్టులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన డి.యుగంధర్‌ రాష్ట్ర ఖోఖో జట్టులో స్థానం సంపాదించాడు. ఈ నెల 13 నుంచి కర్ణాటక రాష్ట్రంలో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో యుగంధర్‌ రాష్ట్ర జట్టు తరఫున ప్రాతినిథ్యం వహించనున్నాడని పాఠశాల హెచ్‌ఎం విజయలక్ష్మి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement