నీట్ పరీక్ష కోసం అహర్నిశలు శ్రమించి, ఎన్నో వ్యయప్రయాసలు భరించి పరీక్ష రాసిన విద్యార్థులకు ఈ పరిణామం విషమ పరీక్షగా మారింది. పరీక్ష పూర్తయ్యిందన్న ఆనందంలో ఉన్న విద్యార్థులు ఇప్పుడు మళ్లీ పునశ్చరణకు సిద్ధం కావాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. నీట్ పరీక్షలో తరచూ తలెత్తుతున్న సమస్యలు విద్యార్థుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. దీంతో బైపీసీ కోర్సుపై కూడా విద్యార్థుల్లో వెనుకంజ వేసే పరిస్థితి నెలకొంటోంది.
–మల్లెంపల్లి మురళీకృష్ణ, డైరెక్టర్, ఎసెంట్ మెడికల్ అకాడమీ


