విశాఖ నుంచి తరలివెళ్లే మత్స్య సంపదకు అమెరికా, చైనా, యూరోపియన్ యూనియన్ దేశాల్లో విపరీతమైన ఆదరణ ఉంది. ప్రస్తుతం భారత్ నుంచి జరిగే ఎగుమతుల్లో అమెరికా 35 శాతం వాటాతో అతిపెద్ద కొనుగోలుదారుగా కొనసాగుతుండగా, చైనా మార్కెట్ కూడా వేగంగా విస్తరిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే అమెరికాకు జరిగే ఎగుమతులు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ.. చైనాకు మాత్రం ఎగుమతులు ఏకంగా 22 శాతం పెరగడం విశేషం. వీటితో పాటు ఆగ్నేయాసి యా, జపాన్ దేశాలకూ విశాఖ నుంచి భారీగా సముద్ర ఉత్పత్తు ల ఎగుమతులు సాగుతున్నాయి. ప్రధాన మార్కెట్లకు జరిగిన ఎగుమతుల వివరాలివి..


