కై లాసగిరిపై ఆకర్షణగా త్రిశూలం | - | Sakshi
Sakshi News home page

కై లాసగిరిపై ఆకర్షణగా త్రిశూలం

May 8 2026 9:38 AM | Updated on May 8 2026 9:38 AM

ఆరిలోవ: నగరంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం కై లాసగిరిపై త్రిశూలం ఏర్పాటు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నెల 9న దీని ప్రారంభోత్సవం కావడంతో పనులు వేగవంతం చేశారు. ఇప్పటికే ఇక్కడ ప్లాట్‌ఫాంపై త్రిశూలం, డమరుకం అమర్చడం పూర్తయింది. ఇంకా ఉద్యానవనం, సందర్శకులు సేదదీరేందుకు సిమెంట్‌బెంచీల ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయి. డమరుకంతో కూడిన త్రిశూలం ప్రారంభమైతే ఈ పర్యాటక కేంద్రం మరింత ఆకర్షణీయంగా మారనుందని వీఎంఆర్డీఏ అధికారులు భావిస్తున్నారు. రూ.1.55 కోట్లతో కొండ చివరన ఏర్పాటు చేసిన 55 అడుగుల పొడవుండే ఈ త్రిశూలం కై లాసగిరికి వెళ్లే పర్యాటకులతో పాటు నగరంలోని పలు ప్రాంతాల ప్రజలకు కనిపిస్తుంది. జాతీయరహదారిపై డెయిరీఫారం, ఇసుకతోట, మద్దిలపాలెం వరకు, బీచ్‌రోడ్డు వైపు ఎంవీపీ కాలనీ, ఏయూ వరకు, బీఆర్‌టీఎస్‌ రోడ్డులో ఆరిలోవ, ముడసర్లోవ వైపు ఇది స్పష్టంగా కనిపిస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement