మద్దిలపాలెం: జేఈఈ మెయిన్స్ పేపర్–2(బీ ఆర్క్, బీ ప్లానింగ్–2026) ఫలితాల్లో ఎసెంట్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. బీఆర్క్లో సాసనపూరి తోషిణి ఓపెన్ కేటగిరీలో ఆలిండియా ర్యాంక్ 56, జనరల్ ఈడబ్ల్యూఎస్ ఆలిండియా 3వ ర్యాంక్, బీ ప్లానింగ్లో సుబుద్ధి కృష్ణ చైతన్య జనరల్ కేటగిరీ ఆలిండియా ర్యాంక్ 9 సాధించినట్లు ఎసెంట్ అకడమిక్ డైరెక్టర్ జి.నాగేశ్వరరావు తెలిపారు. బీఆర్క్లో 45, 79, 90, 102, 121, 146, 201, 374, 433, 441 ఆలిండియా టాప్ ర్యాంకులతోపాటు 72 మంది 5 వేల లోపు ర్యాంకులు సాధించి సత్తాచాటినట్లు పేర్కొన్నారు. బీ ప్లానింగ్లో 15, 21, 23, 29, 39, 47, 60, 88, 105, 117, 127, 127, 139, 143, 150, 166, 179, 184, 226, 250, 255, 272, 280, 316, 326,359, 433 ఆలిండియా టాప్ ర్యాంకులతోపాటు 95 మంది 5 వేల లోపు ర్యాంకులు సాధించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఆధ్యాపకులకు, సిబ్బందికి అభినందనలు తెలిపారు.


