అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేక రైళ్లు | - | Sakshi
Sakshi News home page

అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేక రైళ్లు

Nov 15 2025 7:53 AM | Updated on Nov 15 2025 7:53 AM

అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేక రైళ్లు

అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేక రైళ్లు

తాటిచెట్లపాలెం : అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేర్‌ డివిజన్‌ సీనియర్‌ డీసీఎం కె.పవన్‌కుమార్‌ తెలిపారు. విశాఖ–కొల్లాం(08539) వీక్లీ స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 18 నుంచి జనవరి 20వ తేదీ వరకు ప్రతీ మంగళవారం ఉదయం 8.20 గంటలకు విశాఖలో బయల్దేరి బుధవారం మధ్యాహ్నం 1.45 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. కొల్లాం–విశాఖపట్నం (08540) వీక్లీ స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 19 నుంచి జనవరి 21వ తేదీ వరకు ప్రతీ బుధవారం సాయంత్రం 5 గంటలకు కొల్లాంలో బయల్దేరి గురువారం రాత్రి 11 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రైళ్లు దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పడి, జాలర్‌పేట, సేలం, ఈరోడ్‌, తిరుప్పూర్‌, పొదునూర్‌, పాలక్కడ్‌, త్రిచ్చూర్‌, అలువ, ఎర్నాకుళం టౌన్‌, కొట్టాయం, తిరువల్ల, చెంగన్నూర్‌, కాయంకులం స్టేషన్లలో ఆగుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement