
విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నాలు ఆపాలి
డాబాగార్డెన్స్: విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నాలను ఆపాలని, ప్లాంట్కు సొంత గనులు కేటాయించడమే సరైన పరిష్కారమని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ డిమాండ్ చేసింది. బ్లాస్ట్ ఫర్నేస్–3 తిరిగి ఉత్పత్తి ప్రారంభించడాన్ని కమిటీ అభినందించింది. శనివారం వీజేఎఫ్ ప్రెస్క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో పోరాట కమిటీ చైర్మన్ సీహెచ్ నరసింగరావు, కమిటీ కో కన్వీనర్స్ డి.ఆదినారాయణ, రామచంద్రరావు, వి.శ్రీనివాసరావుతో కలిసి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కావాలనే సొంత గనులు ఇవ్వకుండా ప్లాంట్ను నష్టాల్లోకి నెడుతోందని ఆరోపించారు. దీనివల్ల ఏటా రూ. 4 వేల కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. కనీసం స్టీల్ప్లాంట్ను సెయిల్లోనైనా విలీనం చేయాలని వారు కోరారు. కేంద్రం స్టీల్ప్లాంట్లోని ఉత్పత్తి విభా గాల ఆపరేషన్, మెయింటెనెన్స్ పనులను ప్రైవేట్ కంపెనీలకు అప్పగించాలని నిర్ణయించిందని, సింటర్ ప్లాంట్, రా మెటీరియల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ విభాగాలకు జూలై 12 నాటికి టెండర్లు ఆహ్వానించిందని తెలిపారు. ఈ విధంగా మొత్తం 13 విభాగాలను ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఇది పర్మినెంట్, కాంట్రాక్ట్ కార్మికులను తొలగించి, ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకువచ్చే ప్రయత్నమని మండిపడ్డారు. 1583 రోజులుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయని, గత మూడు నెలల్లో సుమారు 5 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను ఎటువంటి నోటీసులు లేకుండా తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది మంది నిర్వాసితులను ఉద్యోగాల నుంచి తొలగిస్తుంటే గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు యాజమాన్యంతో కుమ్మకై ్క మోసగిస్తున్నారని ఆరోపించారు.