
నేటి నుంచి బాబూజీ మహరాజ్ జయంత్యుత్సవాలు
నందిగామ: కన్హా శాంతి వనంలో మంగళవారం నుంచి మే 1వ తేదీ వరకు బాబూజీ మహరాజ్ 125వ జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు పీఆర్ఓ చంద్రారెడ్డి తెలిపారు. భారతీయ సాంస్కృతిక శాఖ సహకారంతో హార్ట్ ఫుల్నెస్ గ్లోబల్గైడ్ కమ్లేష్ డి.పటేల్(దాజీ) ఆధ్వర్యంలో వేడుకలు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా గవర్నర్ జిష్ణుదేవ్వర్మ, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అభ్యాసీలకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఏర్పాట్లను చేసినట్లు తెలిపారు.
కన్హా శాంతివనం