
డిగ్రీలో ప్రవేశాలు అంతంతే
ఇంటర్ పూర్తి చేసి సాధారణ డిగ్రీ పూర్తి చేస్తే ఉద్యోగాలు దొరకవనే అపోహ కారణంగా డిగ్రీలో అడ్మిషన్లు తగ్గుతున్నాయి. దీంతో ఆ ఎఫెక్ట్ పీజీ కోర్సులపై పడుతోంది. ప్రస్తుతం డిగ్రీ కోర్సులలోనూ ప్రభుత్వం డబుల్ మేజర్ సబ్జెక్ట్తో పాటు ఏఐ, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్ వంటి కోర్సులలో శిక్షణ ఇచ్చి ప్రోత్సహిస్తోంది. ఎన్ఈపీతో డిగ్రీ స్థాయిలో విదార్థులు ఉద్యోగాలు సాధిస్తున్నారు.
– పీసీ వెంకటేశ్వర్లు, కన్వీనర్, పీజీ సెట్–2025
పీజీ కోర్సులతో ఉన్నత ఉద్యోగాలు
పీజీ కోర్సులు పూర్తి చేసిన వారు ఉన్నత ఉద్యోగాలు సాధిస్తున్నారు. ఎన్ఈపీ ద్వారా విద్యారంగంలో పలు నూతన సంస్కరణలకు బీజం పడింది. ఉపాధి, ఉద్యోగ కల్పనే లక్ష్యంగా పీజీ కోర్సులతో పాటు స్కిల్డెవలప్మెంట్ పెంపొందించుకోవాల్సిన అవసరముంది. డిగ్రీలో ప్రవేశాలు తగ్గడంతో పాటు డిగ్రీ పూర్తయిన వెంటనే ఉద్యోగాల వైపు యువత వెళ్లడమే పీజీలో అడ్మిషన్లు తగ్గడానికి ప్రధాన కారణం.
– సీహెచ్ అప్పారావు, వీసీ, ఎస్వీయూ
ఆలోచించాల్సిందే..
డిగ్రీ పూర్తి చేసిన యువత ఉపాధి వైపు చూస్తున్నారు. పీజీ, పీహెచ్డీలపై అధునిక యువత ఉత్సాహం చూపకపోవడంపై ఆలోచించాల్సిందే. పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థి తన లక్ష్యం మెడిసిన్, ఇంజినీరింగ్ అనే భావిస్తున్నారు. దీంతో సాధారణ డిగ్రీలో అడ్మిషన్లు తగ్గుతున్నాయి. తల్లిదండ్రులు సైతం వారి ఆలోచనను ప్రొత్సహిస్తున్నారు. ఉన్నత విద్యే లక్ష్యంగా విద్యార్థుల అడుగులు పడాలి.
–సురేంద్రబాబు, ఎగ్జామినేషన్స్ డీన్, ఎస్వీయూ

డిగ్రీలో ప్రవేశాలు అంతంతే

డిగ్రీలో ప్రవేశాలు అంతంతే