నలుగురు ఎర్రదొంగల అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

నలుగురు ఎర్రదొంగల అరెస్ట్‌

Jun 9 2025 7:56 AM | Updated on Jun 9 2025 7:56 AM

నలుగురు ఎర్రదొంగల అరెస్ట్‌

నలుగురు ఎర్రదొంగల అరెస్ట్‌

తిరుపతి మంగళం : అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె అటవీప్రాంతంలో అక్రమంగా తరలిస్తున్న 48 ఎరచ్రందనం దుంగలతో పాటు ఒక మోటారు సైకిల్‌ను స్వాధీనం చేసుకుని, నలుగురు స్మగ్లర్లను టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ జి. బాలిరెడ్డి ఆధ్వర్యంలో ఆర్‌ఐ చిరంజీవులుకు చెందిన ఆర్‌ఎస్‌ఐ మురళీధరరెడ్డి టీమ్‌ శనివారం అన్నమయ్య జిల్లా బురకాయల కోట అటవీ ప్రాంతం చేరుకుంది. స్థానిక అటవీ అధికారులు జయప్రసాదరావు, మోహన్‌ రెడ్డి, షబీన్‌ తాజ్‌ ల సహకారంతో వేపూరి కోట ఫారెస్ట్‌ బీటు పరిధిలో కూంబింగ్‌ చేపట్టింది. ఈ క్రమంలో ఆదివారం వేకువజామున వీరుఅన్నగారిపల్లె సమీపంలోని వంకగట్టు వద్ద ఎర్రదొంగలు కనిపించారు. పారిపోయేందుకు యత్నింగా వెంబడించి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిని అన్నమయ్య జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. నిందితులతోపాటు ఎరచ్రందనం దుంగలు, మోటారు సైకిల్‌ను తిరుపతి టాస్క్‌ ఫోర్స్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సీఐ సురేష్‌ కుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement