
బస్సు ఢీకొని యువకుడి మృతి
తడ : మండలంలోని బీఎల్పాడు వద్ద జాతీయ రహదారిపై మంగళవారం బస్సు ఢీకొని ఓ యువకుడు మృతి చెందాడు. వివరాలు.. దొరవారిసత్రం మండలం, ఉచ్చూరు గ్రామానికి చెందిన చిత్త్రూు మునీంద్ర(25) ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. ఆరంబాకంలో పని ముగించుకుని బైక్పై ఇంటికి వస్తుంగా తిరుపతి నుంచి చైన్నె వెళుతున్న తమిళనాడు బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మునీంద్రను 108లో సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.
జాతరలో ఘర్షణ
– యువకుడికి కత్తిపోట్లు
ఏర్పేడు : మండలంలోని వికృతమాల పంచాయతీ తుడా కాలనీలో గంగమ్మ జాతర సందర్భంగా మంగళవారం రాత్రి జరిగిన ఘర్షణలో ఓ యువకుడు కత్తిపోట్లకు గురయ్యాడు. మరో యువకుడు సైతం గాయపడ్డాడు. వివరాలు.. తుడా కాలనీలో జాతరకు రేణిగుంట మండలం మర్రిగుంట నుంచి కొందరు యువకులు వెళ్లారు. అక్కడ స్థానిక యువకులు కొందరు మద్యం మత్తులో వీరిని దూషిస్తూ దాడికి దిగారు. దీంతో మర్రిగుంటకు చెందిన సాయి(22)ని కత్తితో పొడిచేశారు. మధు అనే యువకుడిని విచక్షణారహితంగా కొట్టారు. సమాచారం అందుకున్న ఏర్పేడు సీఐ శ్రీకాంత్రెడ్డి, ఎస్ఐ శ్రీకాంత్రెడ్డి హుటాహుటిన గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు. నిందితులు పరారీలో ఉన్నారు.
హోటల్లో ఫుడ్ పాయిజన్
– ఇద్దరు యువకులకు అస్వస్థత
రేణిగుంట : పట్టణంలోని ఓ హోటల్లో బిరియానీ తిని ఇద్దరు యువకులు మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. హోటల్ తనిఖీలు నిర్వహించారు. మాంసాహారం నిల్వ ఉండడం, పరిసరాలు పరిశుభ్రంగా ఉండడంతో హోటల్ను సీజ్ చేశారు. డిప్యూటీ ఎంపీడీఓ ప్రభురావు మాట్లాడుతూ బిరియానీ ఫుడ్ పాయిజనింగ్ కావడంతో ఇద్దరు యువకులు ఆస్పత్రి పాలైనట్లు వెల్లడించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు హోటల్ను సీజ్ చేసినట్టు తెలిపారు. కార్యదర్శి మణి, శానిటరీ ఇన్స్పెక్టర్ రవికుమార్ పాల్గొన్నారు.

బస్సు ఢీకొని యువకుడి మృతి

బస్సు ఢీకొని యువకుడి మృతి