తిరుపతి అర్బన్ : జిల్లాలోని మామిడి జ్యూస్ ఫ్యాక్టరీలకు సహకారం అందించాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి బ్యాంక్ అధికారులతో వర్చువల్గా సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ ఫ్యాక్టరీ యజమానులు తీసుకున్న రుణాలను రీషెడ్యూల్ చేయాలని సూచించారు. ఈ క్రమంలోనే ఫ్యాక్టరీ వారు సైతం మామిడి కొనుగోళ్లలో రైతులకు న్యాయం చేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ రవికుమార్ పాల్గొన్నారు.
టెంపో ఢీకొని వ్యక్తి దుర్మరణం
పాకాల : మండలంలోని దామలచెరువు వద్ద జాతీయ రహదారిపై టెంపో ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలు.. కల్లూరుకు చెందిన సాధిక్బాషా(40) స్కూటీలో వస్తుండగా అక్కగార్ల ఆలయం వద్ద ఎదురుగా వస్తున్న టెంపో వేగంగా ఢీకొంది. దీంతో సాధిక్బాషా అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.