హైకోర్టు జడ్జిగా సీవీ భాస్కర్‌రెడ్డి ప్రమాణం

Vijaya Bhaskar Reddy Appointed Telangana High Court Judge - Sakshi

తొలిరోజు ఫస్ట్‌ కోర్టు హాల్‌లో సీజేతో కలసి విధుల నిర్వహణ

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ న్యాయవాది చాడ విజయభాస్కర్‌రెడ్డి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. హైకోర్టు ప్రాంగణంలోని మొదటి కోర్టు హాల్‌లో గురువారం ఉదయం ఆయనతో సీజే జస్టిస్‌ ఉజ్జల్‌భూయాన్‌ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి పలువురు న్యాయ మూర్తులు, న్యాయాధికారులు హాజరయ్యారు.

తొలిరోజు సీజేతో కలసి మొదటి కోర్టు హాల్‌లో విధులు నిర్వహించారు. జస్టిస్‌ చాడ విజయభాస్కర్‌రెడ్డి ప్రమాణంతో హైకోర్టులో జడ్జిల సంఖ్య 28కి పెరిగింది. అలాగే.. సుప్రీంకోర్టు కొలీజియం గత వారం సిఫార్సు చేసిన ఆరుగురికి ఆమోదం లభిస్తే ఈ సంఖ్య 34కు చేరనుంది. ఆ తర్వాత కూడా మరో 8 న్యాయమూర్తుల ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంటుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top