బీజేపీలోకి ఇద్దరు టీఆర్ఎస్ కార్పోరేటర్లు
సాక్షి, హైదరాబాద్ : వెంగల్ రావు నగర్ సిట్టింగ్ టీఆర్ఎస్ కార్పొరేటర్ కిలారి మనోహర్, రామచంద్రాపురం కార్పొరేటర్ అంజయ్య యాదవ్లు బీజేపీలో చేరారు. టీఆర్ఎస్నుంచి టికెట్ ఇవ్వకపోవటంతో గురువారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కిలారి మనోహర్ జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల వాట్సప్ గ్రూపులో అభ్యంతరకర వీడియోలు పెట్టి అప్పట్లో వార్తల్లోకెక్కిన సంగతి తెలిసిందే. కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆయనకు వెంగల్ రావు నగర్ బీజేపీ టికెట్ ఖరారు చేశారు.