తల్లీకొడుకులను బలితీసుకున్న కరోనా 

In Three Days Mother And Son Died With Covid - Sakshi

కేశంపేట: కరోనాతో తల్లీ కొడుకులు మూడు రోజుల వ్యవధిలోనే మృతి చెందిన ఘటన మండల పరిధిలోని కొండారెడ్డిపల్లిలో చోటుచేసుకుంది. మండల పరిధిలోని కొండారెడ్డిపల్లికి చెందిన శంకర్‌ (55)కు పది రోజుల క్రితం కరోనా రావడంతో మహబూబ్‌నగర్‌లోని ప్రైయివేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు.

శంకర్‌ తల్లి చంద్రమ్మ (75) కూడా మూడు రోజుల క్రితం కరోనాతోనే మృతి చెందింది. తల్లి కొడుకుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

(చదవండి: హైదరాబాద్‌లో కిక్కిరిసిపోతున్న ఐసోలేషన్‌ కేంద్రాలు)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top