రాజు ఆత్మహత్య: కేటీఆర్‌ స్పందన..

Saidabad Rape Case: KTR Reacts On Accused Raju Suicide - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సైదాబాద్‌ చిన్నారి అత్యాచారం, హత్యకేసు నిందితుడు రాజు ఆత్మహత్యపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. ‘నిందితుడు రాజు ఆత్యహత్య చేసుకున్నట్లు తెలంగాణ డీజీపీ సమాచారం అందించారు. నిందితుడు రాజు మృతదేహం వరంగల్‌ జిల్లాలోని స్టేషన్‌ ఘన్‌పూర్‌ రైల్వే ట్రాక్‌పై గుర్తించారు’ అని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.   

స్టేషన్‌ ఘన్‌పూర్‌ రైల్వే ట్రాక్‌వద్ద రాజు మృత దేహం లభ్యమైందని తెలంగాణ డీజీపీ ట్వీట్‌ చేశారు. రైల్వే ట్రాక్‌పై దొరికిన మృతదేహంపై మౌనిక అని పచ్చబొట్టు ఉండటంతో నిందితుడు రాజు అని నిర్థారించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top