కొనసాగుతున్న పంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌ | Final Phase Of Telangana Gram Panchayat Elections 2025 Polling On Dec 17th Live Updates And Highlights Telugu | Sakshi
Sakshi News home page

Live Updates

Cricker

కొనసాగుతున్న పంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌

తుది విడుత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ హవా

  • తుది విడుత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కొనసాగుతున్న కాంగ్రెస్‌ హవా
  • కాంగ్రెస్‌-528
  • బీఆర్‌ఎస్‌- 183
  • బీజేపీ - 43
  • ఇతరులు-124పైగా సర్పంచ్‌ల విజయం
  • వార్డులలోనూ కొనసాగుతున్న కాంగ్రెస్‌ హవా

 

2025-12-17 16:47:09

కొనసాగుతున్న కౌంటింగ్

4159 స్థానాలకు పోలింగ్

  • 531 స్థాన్లాలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల విజయం 
  • 186 స్థానాల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల విజయం 
  • 43 స్థానాల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థుల విజయం 
  • 125 స్థానాల్లో ఇతరుల విజయం 
2025-12-17 14:27:17

సిద్దిపేట జిల్లాలో

సిద్ధిపేట జిల్లాలో భారీగా నమోదైన పోలింగ్ శాతం

చేర్యాల - 81.99%

మద్దూర్ - 87.53%

కొమురవెళ్లి - 85.79%

దూల్మిట్ట - 89.34%. 

2025-12-17 14:27:17

ప్రారంభమైన కౌంటింగ్‌ పక్రియ

  • తెలంగాణలో తుది విడత పంచాయితీ ఎన్నికల పోలింగ్‌ 
  • ప్రారంభమైన కౌంటింగ్‌ పక్రియ

 

2025-12-17 14:11:57

మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్

  • పోలింగ్ కేంద్రాల్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం.
  • మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్.
  • మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్న అధికారులు.
  • కౌంటింగ్ ప్రక్రియకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపిన డీజీపీ.
2025-12-17 13:57:18

మూడో విడతలో జిల్లాలో 85.94 శాతం పోలింగ్ నమోదు

  • యాదాద్రి భువనగిరి జిల్లా ముగిసిన పంచాయతీ ఎన్నికల సమరం
  • మూడో విడతలో జిల్లాలో 85.94 శాతం పోలింగ్ నమోదు
2025-12-17 13:37:27

కాసేపట్లో కౌంటింగ్‌ ప్రారంభం

  • తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తుది విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌
  • మరికాసేపట్లో కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభం
  • మొదట వార్డు.. ఆ తర్వాతే సర్పంచ్‌ స్థానాలకు లెక్కింపు
  • తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు
  • ఆ తర్వాతే బ్యాలెట్‌ పేపర్ల లెక్కింపు
  • సాయంత్రంకల్లా వెలువడనున్న ఫలితాలు
  • సమస్యాత్మక ప్రాంతాల్లో రాత్రికల్లా ఫలితాలు
2025-12-17 13:34:06

  • తెలంగాణలో ముగిసిన పంచాయితీ ఎన్నికల పోలింగ్‌
  • ఒంటి గంట దాకా నడిచిన తుది దశ పంచాయితీ ఎన్నికల పోలింగ్‌
  • 1గం. క్యూ లైన్‌లో ఉన్నవారికి ఓటేసే అవకాశం
  • 2గం. నుంచి ప్రారంభం కానున్న కౌంటింగ్‌ ప్రక్రియ
  • మరికాసేపట్లో ఓటింగ్‌ శాతంపై రానున్న స్పష్టత 
2025-12-17 13:03:07

ఓటు కోసం వెళ్లి ప్రమాదానికి గురైన దంపతులు

ములుగు జిల్లా

  • ఓటు కోసం వెళ్లి ప్రమాదానికి గురైన దంపతులు.
  • వెంకటాపూర్ మండలం నర్సాపూర్ వద్ద అదుపుతప్పి బోల్తా పడ్డ కారు.
  • అల్వాల అపర్ణ అక్కడికక్కడే మృతి, భర్త దేవేందర్‌కు గాయాలు.
  • భూపాలపల్లి సింగరేణిలో పనిచేస్తున్న దేవేందర్ స్వగ్రామం నర్సంపేట మండలంలోని గురిజాల పోలింగ్ కేంద్రంలో ఓటు వేసి తిరిగి భూపాలపల్లి వెళ్తుండగా ప్రమాదం.
  • మృతదేహాన్ని ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు.
  • కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న బంధువులు.
2025-12-17 12:41:46

రాష్ట్ర ఎన్నికల కార్యాలయానికి చేరుకున్న సీఎస్‌, డీజీపీ

మూడో విడత పంచాయతీ ఎన్నికల నేపధ్యంలో రాష్ట్ర ఎన్నికల కార్యాలయానికి సీఎస్‌, డీజీపీ చేరుకున్నారు.  డీజీపీ మాట్లాడుతూ..

  • ఎన్నికలు సజావుగా జరుగున్నాయి.
  • రేపు కూడా మా బలగాలు కొనసాగుతాయి.
  • ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా ఎన్నికలు జరుగుతున్నాయి.
2025-12-17 12:39:11

సంగారెడ్డి జిల్లాలో ఉదయం 11 గంటల వరకు 59.39పోలింగ్ నమోదు

2025-12-17 12:30:46

యాదాద్రి భువనగిరి జిల్లా

  • మూడో దశ పంచాయతీ ఎన్నికల్లో ఉదయం 11గంటల వరకు 56.58% పోలింగ్ నమోదు
2025-12-17 12:28:41

ఖమ్మం జిల్లా

  • పెనుబల్లి మండలం సూరయ్య బంజర్ తండాలో ఉద్రిక్తత.

  • పోలింగ్ బూత్ లో ఏజెంట్ల మధ్య వాగ్వాదంతో చెలరేగిన వివాదం.

  • ఇరు వర్గాల వారిని పోలింగ్ కేంద్రం నుంచి బయటకు పంపిన పోలీసులు.

2025-12-17 12:28:41

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ

రంగారెడ్డి జిల్లా

  • మంచాల మండలం అస్మత్పూర్ వార్డులో ఉద్రిక్తత.
  • కాంగ్రెస్ అభ్యర్థి పోలింగ్ బూత్‌లో ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ ఆగ్రహం.
  • బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.
  • పరస్పరం దాడులు చేసుకున్న రెండు పార్టీల కార్యకర్తలు.
2025-12-17 12:20:54

నిజమాబాద్ 

  • జిల్లాలో కొనసాగుతున్న పోలింగ్. 

  • 11 గంటల వరకు 53.69 శాతం పోలింగ్ నమోదు. 

కామారెడ్డి

  • జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్. 11 గంటల వరకు 56.71 

2025-12-17 12:18:22

కరీంనగర్

  • కొనసాగుతున్న చివరి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ 

  • ఉదయం 11 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం జగిత్యాల 52.82శాతం 

  • పెద్దపల్లి 57.22 శాతం 

  • కరీంనగర్ 55.67 శాతం

  • రాజన్న సిరిసిల్ల 46.90 శాతం

2025-12-17 12:16:20

రాష్రవ్యాప్తంగా 60 శాతం పోలింగ్‌

11 గంటల వరుకు రాష్రవ్యాప్తంగా 60 శాతం పోలింగ్‌ జరిగింది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది.

2025-12-17 12:11:57

ఎన్నికలను బహిష్కరించిన గ్రామస్తులు

ఖమ్మం జిల్లా 

  • ఏన్కూరు మండల పరిధిలోని కొత్త మేడేపల్లి గ్రామపంచాయతీ ఎన్నికలను బహిష్కరించిన గ్రామస్తులు.
  • గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్.
  • గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా ఓటింగ్‌ను బహిష్కరించిన గ్రామస్తులు.
  • తమ గ్రామ సమస్యలు పరిష్కారం చేస్తామని స్పష్టమైన హామీ ఇస్తేనే ఓట్లు వేస్తామంటున్న ఓటర్లు.
  • కల్లూరు మండలం చెన్నూరులో ఓ ఇంటర్నెట్ దుకాణంలో డబ్బులు పంచుతున్నారన్న సమాచారంతో ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు.
  • 95000 నగదు ను సీజ్ చేసి నిర్వహకుడిని పోలీస్ స్టేషన్‌కు తరలింపు.
  • సత్తుపల్లి మండలం బెతుపల్లి గ్రామం లో ఓటు వేసి ఇంటికి వెళ్తుండగా గుండెపోటుకు గురైన సత్యనారాయణ(65) అనే వృద్ధుడు.
  • ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి.
2025-12-17 11:19:46

ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలించిన జిల్లా ఎస్పీ

జగిత్యాల జిల్లా 

  • గొల్లపల్లి మండలకేంద్రంలో ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.
2025-12-17 11:17:09

7 గంటల నుంచి 9 గంటల వరకు పోలింగ్ శాతం 28.32 శాతం

జోగులాంబ గద్వాల

  • జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని ఐదు మండలాలలో ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు పోలింగ్ శాతం 28.32 శాతం 

  • అలంపూర్ 29.00 శాతం 

  • మానవపాడు 23.73 శాతం

  • ఉండవెల్లి 28.81 శాతం

  • ఇటిక్యాల 26.81 శాతం

  • ఎర్రవల్లి 33.16 శాతం

2025-12-17 11:07:11

కరీంనగర్

కొనసాగుతున్న చివరి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉదయం 9 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం జగిత్యాల 21.74 

  • పెద్దపల్లి 22.50 శాతం
  • కరీంనగర్ 20.66 శాతం 
  • రాజన్న సిరిసిల్ల 18.69 శాతం
2025-12-17 11:01:43

నాగర్ కర్నూలు

  • నాగర్ కర్నూలు జిల్లాలో అచ్చంపేట నియోజకవర్గంలో 3వ విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఉదయం 9.00 గంటల సమయానికి సగటున 25.70శాతం పోలింగ్ నమోదు. 
    మండలాల వారీగా.. అచ్చంపేట... 27.45% 
    అమ్రాబాద్...25.26% 
    బల్మూర్... 22.04 
    లింగాల.. 27.16 
    ఉప్పునుంతల ...25.80 
    పదార....25.29

      చారకోండ ....27.73

2025-12-17 10:58:08

పోలింగ్ నిలిపివేసిన అధికారులు

పెద్దపల్లి జిల్లా 

  • ఓదెల మండలం హరిపురంలో ఆరవ వార్డు పోలింగ్ స్టేషన్‌లో పోలింగ్ నిలిపివేసిన అధికారులు. 

  • పోలింగ్ బూత్‌లో ఏజెంట్‌కు బదులు వార్డు సభ్యుడి కోసం బరిలోకి దిగిన అభ్యర్థి కూర్చోవడంతో గ్రామస్థుల ఆందోళన.

  • పోలింగ్ నిలిపేసి అధికారులకు సమాచారం ఇచ్చిన సిబ్బంది.

2025-12-17 10:54:32

9 గంటల వరకు 26.75శాతం పోలింగ్ నమోదు

  • సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉదయం 9 గంటల వరకు 24.35 శాతం పోలింగ్ నమోదు 

  • మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉదయం 9 గంటల వరకు 24.89 శాతం పోలింగ్ నమోదు

  • సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉదయం 9 గంటల వరకు 26.75శాతం పోలింగ్ నమోదు

2025-12-17 10:51:31

9 గంటల వరకు 21.27 శాతం నమోదైన పోలింగ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 
మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా 9 గంటల వరకు 21.27 శాతం నమోదైన పోలింగ్.

2025-12-17 10:31:28

వికారాబాద్

  • వికారాబాద్ జిల్లాలో ఉదయం 9 గంటల వరకు 21.86 శాతం పోలింగ్ నమోదు

2025-12-17 10:28:34

పోలింగ్ కేంద్రాల వద్ద స్వల్ప ఉద్రిక్తత

సూర్యాపేట జిల్లా 

  • నేరేడుచర్ల మండలం ఎల్బీ నగర్, దర్శించర్ల పోలింగ్ కేంద్రాల వద్ద స్వల్ప ఉద్రిక్తత

  • పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారం నిర్వహిస్తున్నారంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య వివాదం

  • ఇరు పార్టీల‌ కార్యకర్తల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం

2025-12-17 10:25:32

నల్లగొండ జిల్లా 

  • మూడో దశ పంచాయతీ ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు 29.06 శాతం పోలింగ్ నమోదు
2025-12-17 10:20:10

నిజామాబాద్ జిల్లా

  • తొలి రెండు గంటల్లో 23.35 శాతం పోలింగ్ నమోదు.
  • మెండోరాలో అత్యధికంగా 28.11 శాతం
  • వేల్పూరులో అత్యల్పంగా 17.88 
    కామారెడ్డి జిల్లా జిల్లాలో తొలి రెండు గంటల్లో 21.49 శాతం పోలింగ్ నమోదు. 
  • అత్యధికంగా బిచ్కుందలో 27.70
  • అత్యల్పంగా మద్నూర్ లో 14.70 పోలింగ్ నమోదు.
2025-12-17 10:18:45

పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తున్న ఎన్నికల అధికారి, కలెక్టర్

వరంగల్ జిల్లా

  • నర్సంపేట, నెక్కొండ. చెన్నారావుపేట, ఖానాపురం మండలాల్లో ఏర్పాటు చేసిన ఆకుపచ్చని హరిత పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తున్న ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్యశారద.

2025-12-17 10:13:28

నిజామాబాద్ జిల్లా మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఉదయం 9 గంటల వరకు 23.35 శాతం పోలింగ్ నమోదు.

2025-12-17 10:11:33

సంగారెడ్డి జిల్లా 
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని ఏడు మండలాలకు ఉదయం 9 గంటల వరకు పోలింగ్ శాతం 

  • నారాయణఖేడ్ 24.08% 
  • కంగ్టి 30.01% 
  • మానూర్ 25.05% 
  • నాగల్ గిద్ద 26.02% 
  • సిర్గాపూర్ 28.04% 
  • కల్హేర్ 26.7%
  • నిజాంపేట్ 20.03%
2025-12-17 10:10:19

ఓటేసేందుకు లండన్‌ నుంచి వచ్చి..

  • అబ్దుల్లాపూర్‌మెట్‌ పంచాయతీ ఎన్నికల్లో ఆసక్తికర ఘటన
  • తన స్వగ్రామంలో ఓటు వేసేందుకు లండన్ నుంచి వచ్చిన విద్యార్థి
  • ఓటు హక్కు వినియోగించుకున్న లవన్ కుమార్
     
2025-12-17 09:51:32

ఉదయం 9 గంటలు.. 24 పోలింగ్ శాతం నమోదు

  • తెలంగాణ లో కొనసాగుతున్న తుది విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్
  • 3,752 పంచాయతీలు, 28, 410 వార్డులకు కొనసాగుతున్న పోలింగ్‌
  • ఉదయం 9 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 24 పోలింగ్ శాతం నమోదు
  • మధ్యాహ్నాం 1గం. దాకా పోలింగ్‌
  • 2గం. నుంచి ప్రారంభం కానున్న కౌంటింగ్‌
  • సాయంత్రం కల్లా వెలువడనున్న ఫలితాలు
  • వీలైతే ఇవాళే ఉప సర్పంచ్‌ ఎన్నికలు.. కుదరకుంటే రేపే!
2025-12-17 09:45:46

సూర్యాపేటలో మండలాల వారీగా పోల్ అయిన వివరాలు

సూర్యాపేట జిల్లా

  • సూర్యాపేట జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో మొదటి రెండు గంటలలో ( ఉదయం 7:00 గంటల నుండి 9:00 గంటల వరకు )మండలాల వారీగా పోల్ అయిన వివరాలు శాతంలలో చింతలపాలెం - 26.84 % 
  • గరిడేపల్లి - 25.18 % 
  • హుజూర్నగర్ - 20.66 % 
  • మట్టంపల్లి - 27.74 % 
  • మేళ్లచెర్వు - 23.48 % 
  • నేరేడుచర్ల - 21.02 % 
  • పాలకవీడు - 26.70 %
  • జిల్లాలో పోలింగ్ సరాసరి.. 24.83 %
     
2025-12-17 09:40:58

నందిపేటలో పోటెత్తిన ఓటర్లు

నిజామాబాద్

  • నందిపేటలో పోటెత్తిన ఓటర్లు.
  • ఓటు వేసేందుకు భారీగా తరలివచ్చిన మహిళా ఓటర్లు.
  • నందిపేట పోలింగ్ కేంద్రంలో 10 వేలకు పైగా ఓటర్లు.
  • జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో బారులు తీరిన ఓటర్లు.
2025-12-17 09:37:09

400 మంది పైగా ప్రచారం చేస్తున్న అభ్యర్థుల మద్దతుదారులు

పెద్దపల్లి జిల్లా
 
  • ఓదెల మండల కేంద్రంలో మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో 100 మీటర్ల అవతల పెద్ద ఎత్తున 400 మంది పైగా ప్రచారం చేస్తున్న అభ్యర్థుల మద్దతుదారులు.
  • అభ్యర్థుల మద్దతుదారులు 144 సెక్షన్ ఉల్లంఘించారని ఆరోపణ.
  • ఘటన స్థలానికి చేరుకొని ప్రజలను వెనుకకు పంపిస్తున్న గోదావరిఖని ఏసిపి రమేష్.

 
2025-12-17 09:19:30

ఓటు హక్కును వినియోగించుకుంటున్న ఓటర్లు

మహబూబ్‌నగర్ జిల్లా

  • మూడవ విడత స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా జడ్చర్ల బాలానగర్ మండలాల పరిధిలో పోలింగ్ కేంద్రాలలో ఉదయం 7 గంటల నుండి ప్రారంభమైన పోలింగ్. తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న ఓటర్లు.

  • నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో మూడో విడత స్థానిక సంస్థలోఎన్నికల సందర్భంగా ఉప్పునుంతల మండలం లోని పలు గ్రామాలలో మొదలైన పోలింగ్.
     

వనపర్తి జిల్లా

  • పెబ్బేరు, శ్రీరంగాపురం మండలాలలో మొదలైన మూడో విడత పోలింగ్.
     

నారాయణపేట జిల్లా

  • మక్తల్ నియోజకవర్గంలోని నర్వ మండలంలో ప్రారంభమైన మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్.

  • తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న గ్రామస్తులు.
     

జోగులాంబ గద్వాల జిల్లా

అలంపూర్ నియోజకవర్గంలోని మానవపాడు,ఎర్రవల్లి,ఇటిక్యాల, ఉండవెల్లి,అలంపూర్ మండలాలలో మూడో విడత ఎన్నికల్లో 75 గ్రామ పంచాయతీలగాను 7 గ్రామపంచాయతీలో ఏకగ్రీవం కాగా మిగిలిన 68 గ్రామపంచాయతీలో కొనసాగుతున్న పోలింగ్.

2025-12-17 08:25:58

ప్రశాంతంగా జరుగుతున్న మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్

సిద్దిపేట జిల్లా
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాల్లో ప్రశాంతంగా జరుగుతున్న మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ 

  • మూడు మండలాల్లో కలిపి మొత్తం 82 గ్రామ పంచాయతీలకు గాను 11 గ్రామపంచాయతీలు ఏకగ్రీవం 

  • మిగతా 71 గ్రామపంచాయతీలకు జరుగుతున్న ఎన్నికలు 

  • పోలింగ్ కేంద్రాలకు చేరుకొని ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఓటర్లు

  • ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు

2025-12-17 08:18:22

కొనసాగుతున్న తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్

రాజన్న సిరిసిల్ల జిల్లా

  • జిల్లాలో కొనసాగుతున్న తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్.
  • సిరిసిల్ల నియోజకవర్గంలోని ఎల్లారెడ్డి పేట, వీర్నపల్లి, ముస్తాబాద్ మరియు గంభీరావుపేట మండలాల్లో పోలింగ్.
2025-12-17 08:13:21

వరంగల్ జిల్లాలో 564 సర్పంచ్ స్థానాల్లో 34 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం

ఉమ్మడి వరంగల్ జిల్లా

ఉమ్మడి వరంగల్ జిల్లాలో 564 సర్పంచ్ స్థానాల్లో 34 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం. 

  • 530 సర్పంచ్ స్థానాలకు బరిలో 1751 మంది అభ్యర్థులు. 

  • 4101 వార్డు స్థానాలకు బరిలో నిలిచిన 9572 మంది అభ్యర్థులు. 

  • 116 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో భారీగా పోలీసుల మోహరింపు. 

  • వరంగల్ జిల్లాలో 102 సర్పంచ్, 809 వార్డు స్థానాలకు ఎన్నికలు. 

  • హన్మకొండ జిల్లాలో 67 సర్పంచ్, 563 వార్డు స్థానాలకు పోలింగ్. 

  • ములుగు జిల్లాలో 45 సర్పంచ్, 329 వార్డు స్థానాలకు పోలింగ్. 

  • భూపాలపల్లి జిల్లాలో 77 సర్పంచ్, 570 వార్డు స్థానాలకు పోలింగ్. 

  • జనగామ జిల్లాలో 88 సర్పంచ్, 692 వార్డు స్థానాలకు పోలింగ్.

  • మహబూబాబాద్ జిల్లాలో 150 సర్పంచ్, 1138 వార్డు స్థానాలకు పోలింగ్.

2025-12-17 08:09:44

పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసుల భారీ బందోబస్తు

జగిత్యాల జిల్లా

  • జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని ధర్మపురి, బుగ్గారం,గొల్లపల్లి,వెల్గటూర్,ఎండపల్లి,పెగడపల్లి మండలాల్లో ప్రశాంతంగా కొనసాగుతున్న తుది విడత పోలింగ్.

  • పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసుల భారీ బందోబస్తు.

2025-12-17 08:04:59

పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్న ఓటర్లు

సిద్దిపేట జిల్లా

  • సిద్దిపేట జిల్లా హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాల్లో ప్రశాంతంగా ప్రారంభమైన మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ 

  • ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్న ఓటర్లు

  • ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు

2025-12-17 08:02:28

ఉదయం చలి, మంచు కురుస్తుండడంతో మందకొడిగా ప్రారంభమైన పోలింగ్

కరీంనగర్ జిల్లా

  • జిల్లాలో కొనసాగుతున్న పంచాయతీ తుది విడత పోలింగ్.

  • ఉదయం చలి, మంచు కురుస్తుండడంతో మందకొడిగా ప్రారంభమైన పోలింగ్.

  • భారీ బందోబస్తు మధ్య గుర్తింపు కార్డులు ఉన్నవారినే లోనికి అనుమతిస్తున్న పోలీసులు.

  • వికలాంగులు, వృద్ధుల కోసం వీల్ చైర్స్ ఏర్పాటు.

  • పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లిలో ఇప్పుడిప్పుడే తరలివస్తున్న ఓటర్లు.

  • సైదాపూర్ హుజురాబాద్ మండలాల్లో కొనసాగుతున్న సర్పంచ్ ఎన్నికలు.

2025-12-17 07:58:57

వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్న జిల్లా కలెక్టర్

వనపర్తి జిల్లా

  • వనపర్తి జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్న జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య.

  • మూడో విడతలో భాగంగా వనపర్తి జిల్లాలో 80 సర్పంచ్ స్థానాలకు, 702 వార్డులకు పోలింగ్.

2025-12-17 07:55:59

యాదాద్రిలో ఆరు మండలాల పరిధిలో తుది దశ పంచాయతీ ఎన్నికలు

యాదాద్రి భువనగిరి జిల్లా 

  • యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆరు మండలాల పరిధిలో తుది దశ పంచాయతీ ఎన్నికలు 

  • 124 సర్పంచ్, 1086 వార్డులకు నోటిఫికేషన్ 

  • 10 సర్పంచ్, 93 వార్డులు ఏకగ్రీవం

  • 114 సర్పంచ్, 993 వార్డులకు ఎన్నికలు

2025-12-17 07:51:49

జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన మూడవవిడత పంచాయతీ ఎన్నికలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 

ఇల్లందు ,టేకులపల్లి ,గుండాల ఆళ్లపల్లి, కారేపల్లి మండలాల్లో ప్రారంభమైన మూడో విడత పంచాయతీ ఎన్నికల ఓటింగ్.

  • జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన మూడవవిడత పంచాయతీ ఎన్నికలు.
  • 155 సర్పంచ్ స్థానాలకు జరగనున్న ఎన్నికలు.
  • ఓటు హక్కు వినియోగించుకోనున్న 1,75,074 మంది ఓటర్లు.
  • ఉదయం 7 గంటలకు ఏజెంట్ల, అబ్జర్వల సమక్షంలో  ప్రారంభమైన పోలింగ్.
  • జిల్లావ్యాప్తంగా 1330 వార్డ్ మెంబర్లు.
  • ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు.
2025-12-17 07:48:21

ప్రశాంతంగా ప్రారంభమైన మూడవ విడత ఎన్నిక

ఖమ్మం

సత్తుపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ప్రశాంతంగా ప్రారంభమైన మూడవ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ.

  • 5 మండలాలలో మొత్తం ఓటర్లు - 1,83,734 మంది

  • మొత్తం సర్పంచ్ అభ్యర్థులు - 307

  • వైరా నియోజకవర్గంలోని ఏనుకూరు మండలాల్లో ప్రారంభమైన మూడవ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్

  • మండలాలలో మొత్తం ఓటర్లు -21550మంది

2025-12-17 07:44:03

సూర్యాపేట జిల్లాలో 22 సర్పంచ్, 257 వార్డులు ఏకగ్రీవం

సూర్యాపేట జిల్లా 

  • సూర్యాపేట జిల్లాలో 7 మండలాల పరిధిలో తుది దశ పంచాయతీ ఎన్నికలు 
  • 146 పంచాయతీలు, 1318 వార్డులకు నోటిఫికేషన్ 
  • 22 సర్పంచ్, 257 వార్డులు ఏకగ్రీవం 
  • 124 సర్పంచ్, 1061 వార్డులకు ఎన్నికలు
  • ఎన్నికల బరిలో మొత్తం 2908 మంది అభ్యర్థులు
2025-12-17 07:40:09

నల్లగొండ ఉమ్మడి జిల్లాలో ప్రారంభమైన తుది దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్

నల్లగొండ జిల్లా

  • నల్లగొండ జిల్లా నల్లగొండ జిల్లాలో తొమ్మిది మండలాల పరిధిలో తుది దశ పంచాయతీ ఎన్నికలు 
  • 269 సర్పంచ్, 2206 వార్డులకు నోటిఫికేషన్
  • 42 సర్పంచ్, 596 వార్డులు ఏకగ్రీవం 
  • 227 సర్పంచ్, 1603 వార్డులకు ఎన్నికలు 
  • 1610 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు
2025-12-17 07:37:30

సమస్యాత్మకమైన కేంద్రాల్లో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు

ఖమ్మం

  • ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ప్రారంభమైన మూడవ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్.

  • సత్తుపల్లి, ఇల్లందు, కొత్తగూడెం, వైరా నియోజక వర్గ పరిధిలో జరుగుతున్న మూడవ విడత ఎన్నికలు.

  • సమస్యాత్మకమైన కేంద్రాల్లో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు.

2025-12-17 07:33:09

రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్

రంగారెడ్డి

  • మూడో విడతలో 163 గ్రామపంచాయతీలకు ఎన్నికలు 

  • 163 గ్రామపంచాయతీల్లో సర్పంచ్‌ పదవి కోసం 559 మంది అభ్యర్థుల పోటీ 

  • జిల్లాలో మూడో విడతలో 174 గ్రామపంచాయతీలకు నోటిఫికేషన్ జారీ 

  • మూడో విడతలో ఏకగ్రీవమైన 10 పంచాయతీలు 

  • కోర్టు కేసు కారణంగా మాడ్గుల మండలం నర్సంపల్లి గ్రామపంచాయతీ ఎన్నిక వాయిదా 

  • మూడో విడతలో 1448 వార్డులకు ఎన్నికలు, పోటీలో 4091 మంది అభ్యర్థులు 

  • మూడో విడతలో 3500 మంది సిబ్బందితో పోలింగ్ 

  • మూడో విడతలో పోలింగ్ జరుగుతున్న మండలాలు: అబ్దుల్లాపూర్ మెట్, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, మాడ్గుల్, కందుకూరు, మహేశ్వరం రంగారెడ్డి జిల్లాలో మొదటి విడతలో 88.67 శాతం పోలింగ్ నమోదు రంగారెడ్డి జిల్లాలో రెండో విడతలో 85.3 శాతం పోలింగ్ నమోదు. 

  • వికారాబాద్ జిల్లా 

  • పరిగి నియోజకవర్గంలోని పరిగి, దోమ, కులకచర్ల, చౌడపూర్, పూడూరు మండలాల్లో ఎన్నికలు 

  • మూడో విడతలో నేడు 139 గ్రామపంచాయతీలకు ఎన్నికలు 

  • 139 గ్రామపంచాయతీల్లో సర్పంచి కోసం 400 మంది అభ్యర్థుల పోటీ 

  • జిల్లాలో మూడో విడతలో 175 గ్రామపంచాయతీలకు నోటిఫికేషన్ జారీ 

  • జిల్లాలో మూడో విడతలో ఏకగ్రీవమైన 18 పంచాయతీలు 

  • మూడో విడతలో 1034 వార్డులకు ఎన్నికలు, 2588 మంది అభ్యర్థుల పోటీ 

  • వికారాబాద్ జిల్లాలో మొదటి విడతలో 81.21 శాతం పోలింగ్ నమోదు 

  • వికారాబాద్ జిల్లాలో రెండో విడతలో 82.72 శాతం పోలింగ్ నమోదు

2025-12-17 07:27:24

163 సర్పంచ్‌లలో 13 మంది ఏకగ్రీవం

సిద్దిపేట జిల్లా
9 మండలాల పరిధిలోని 163 సర్పంచ్‌లలో 13 మంది ఏకగ్రీవాలు అయ్యారు.

  • మిగిలిన 150 సర్పంచ్‌లకు ఎన్నికలు జరగనున్నాయి..1432 వార్డులలో 243 వార్డులు ఏకగ్రీవం కాగా 1182 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి..

2025-12-17 07:22:29

234 గ్రామపంచాయతీలలో 27 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం

సంగారెడ్డి జిల్లా

  • జిల్లాలోని 8 మండలాల పరిధిలోని 234 గ్రామపంచాయతీలలో 27 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.

  • 207 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.1960 వార్డులలో 422 ఏకగ్రీవాలు కాగా 1537 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.. 

2025-12-17 07:22:29

518 సర్పంచ్ 3939 వార్డులకు ఎన్నికలు

మెదక్ జిల్లా

  • ఉమ్మడి మెదక్ జిల్లాలో చివరి విడతలో 518 సర్పంచ్ 3939 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.
  • మెదక్ జిల్లా మొత్తం సర్పంచ్ స్థానాలు 183.
  • ఏకగ్రీవాలు అయిన సర్పంచ్‌లు 22.
  • పోలింగ్ జరగనున్న గ్రామాలు 161.
  • జిల్లాలో 1528 వార్డులకు గాను 308 వార్డులకు ఏకగ్రీవాలు కావడంతో 1220 వార్డ్ లకు పోలింగ్ జరగనుంది. 
2025-12-17 07:22:29

మూడు విడతల్లో పంచాయితీ ఎన్నికల పోలింగ్‌కు నేటితో ముగింపు

కరీంనగర్ జిల్లా

  • మూడు విడతల్లో పంచాయితీ ఎన్నికల పోలింగ్‌కు నేటితో ముగింపు.
  • మూడో విడతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 408 స్థానాలకు నోటిఫికేషన్.
  • 22 ఏకగ్రీవం కావడంతో నేడు 386 స్థానాల్లో ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ. 
  • ఉమ్మడి జిల్లాలోని జిల్లాల వారీగా చూస్తే మూడో విడతలో కరీంనగర్ జిల్లాలో 111 గ్రామాలకుగాను ఇప్పటికే 3 ఏకగ్రీవం కావడంతో నేడు 108 స్థానాల్లో జరుగుతున్న పోలింగ్.
  • జగిత్యాల జిల్లాలో 119 గ్రామాలకు 6 ఏకగ్రీవం కావడంతో 113 స్థానాలకు జరుగుతున్న పోలింగ్.
  • పెద్దపెల్లి జిల్లాలో 91 స్థానాలకు 6 ఏకగ్రీవం కావడంతో 85 స్థానాల్లో జరుగుతున్న పోలింగ్.
  • రాజన్న సిరిసిల్ల జిల్లాలో 87 స్థానాలకు 7 ఏకగ్రీవం కావడంతో నేడు 80 పంచాయితీలకు జరుగుతున్న పోలింగ్.
  • నేటితో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మొత్తం 1224 గ్రామపంచాయితీలకు ముగియనున్న ఎన్నికల ప్రక్రియ.
2025-12-17 07:15:05

ఎస్టీ ఓటర్లు లేకపోవటంతో పోటీ చేసేందుకు దొరకని అభ్యర్దులు

మహబూబ్ నగర్

  • మూడో విడత ఉమ్మడి జిల్లాలో 28 మండలాల పరిధిలో 543 సర్పంచ్,4410 వార్డు సభ్యులకు ఎన్నికలు 

  • సర్పంచ్ పదవులకు 2131 మంది,వార్డు సభ్యులకు11236 మంది పోటీ 

  • ఓటు హక్కు వినియోగించుకోనున్న 7,95,788 మంది ఓటర్లు 

  • నల్లమలలోని ఐదు గ్రామాల్లో ఎన్నికలను బహిష్కరించిన గ్రామస్దులు 

  • ఎస్టీ ఓటర్లు లేకపోవటంతో పోటీ చేసేందుకు దొరకని అభ్యర్దులు 

  • చారకొండ మండలం ఎర్రవల్లిలో రిజర్వాయర్‌ను వ్యతిరేకిస్తూ ఎన్నికలను బహిష్కరించిన గ్రామస్దులు

2025-12-17 07:09:58

మొదలైన మూడవ విడత పంచాయితీ ఎన్నికల పోలింగ్

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా 

  • మొదలైన మూడవ విడత పంచాయితీ ఎన్నికల పోలింగ్ 

  • ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం గ్రామ పంచాయితీలు 333 

  • 20 మండలాలలో ఎన్నికలు 

  • ఏకగ్రీవం అయిన జీపీలు 45 

  • పోలింగ్ జరుగుతున్న పంచాయితీలు 288 

  • పోటీలో ఉన్న అభ్యర్థులు 1024 

  • పోలింగ్ కేంద్రాలు 2900

  • వెబ్ కాస్టింగ్ సెంటర్లు 104

2025-12-17 07:07:08

తెలంగాణలో నేడు తుది విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌

  • మూడో దశ ఎన్నికల్లో భాగంగా.. 3,752 సర్పంచ్‌ పదవులకు 12,652 మంది, 28,410 వార్డులకు 75,725 మంది (నామినేషన్లు దాఖలు కాని, ఏకగ్రీవమైన స్థానాలు మినహాయించి) పోటీపడుతున్నారు.

  • బ్యాలెట్‌ బాక్సుల నుంచి బందోబస్తు వరకు అన్నీ పక్కాగా ఉండేలా ఆయా జిల్లాల్లో అధికార యంత్రాంగం ’జీరో ఎర్రర్‌’ విధానాన్ని అనుసరిస్తోంది.

  • మంగళవారం సాయంత్రంకల్లా మొత్తం పోలింగ్‌ స్లిప్పుల పంపిణీ పూర్తి చేసినట్టు ఎస్‌ఈసీ వెల్లడించింది.

  • ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 

  • ఎన్నికల నిర్వహణలో ఎక్కడ  లోపాలు తలెత్తకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ రాణీకుముదిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

2025-12-17 06:52:36
Advertisement
 
Advertisement
Advertisement