
థాయ్ ఎయిర్లైన్స్ విమానం రద్దు
కొరుక్కుపేట: బ్యాంకాక్కు వెళ్తున్న థాయ్ ఎయిర్ లైనన్స్ విమానం ఆదివారం ఉదయం చైన్నె విమానాశ్రయంలో అకస్మాత్తుగా సాంకేతిక సమస్య తలెత్తింది. ఫలితంగా ఆదివారం విమానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీని కారణంగా, బ్యాంకాక్ కు వెళ్లాల్సిన 164 మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన థాయ్ ఎయిర్లైన్స్ విమానం శనివారం అర్ధరాత్రి 12 గంటలకు చైన్నె అంతర్జాతీయ విమానాశ్రయంలోని అంతర్జాతీయ టెర్మినల్కు చేరుకుంది. తరువాత చైన్నె నుంచి విమానం సాధారణంగా అర్ధరాత్రి 1.10 గంటలకు ప్రయాణికులతో బ్యాంకాక్కు బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో విమానాన్ని నడిపే పైలట్ విమానంలో సాంకేతిక సమస్య ఉందని, దానిని మరమ్మతు చేసిన తర్వాతే వెళ్తుందని ప్రకటించారు. వారికి చైన్నె విమానాశ్రయ లాంజ్లలో వసతి కల్పించారు. తరువాత, ఇంజినీర్లు థాయ్ ఎయిర్లైన్స్ విమా నం ఎక్కి యాంత్రిక సమస్యలను సరిచేయడానికి ప్రయత్నించారు. అయితే ఉదయం 5 గంటల వరకు విమానంలో సంభవించిన యాంత్రిక సమస్యలను పరిష్కరించడం సాధ్యం కాలేదు. ఫలితంగా, బ్యాంకాక్కు వెళ్లే థాయ్ ఎయిర్లైనన్స్ విమానం రద్దు చేశారని ప్రకటించారు. విమానాశ్రయంలోని ప్రయాణికులలో కలకలం రేపింది.
అజ్ఞాతంలోకి
ఎమ్మెల్యే జగన్ మూర్తి
●పొరుగు రాష్ట్రాలకు నాలుగు బృందాలు
సాక్షి, చైన్నె : తిరువేలంగాడులో బాలుడి కిడ్నాప్ కేసు సీబీసీఐడీకి దర్యాప్తును వేగవంతం చేసింది. ముందుస్తు బెయిల్ను కోర్టు నిరాకరించడంతో ఈ కేసులో కీలకంగా ఉన్న ఎమ్మెల్యే జగన్ మూర్తి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆయనకోసం నాలుగు బృందాలను సీబీసీడీ ఉన్నతాధికారులు రంగంలోకి దించారు. తిరువేలంగాడులో బాలుడ్ని కిడ్నాప్ కేసు వ్యవహారంలో ఏడీజీపీ జయరాం, పురట్చి భారతం నేత, ఎమ్మెల్యే జగన్ మూర్తి ప్రమేయం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం జగన్ మూర్తి తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. పోలీసు విచారణకు ఆయన సహరించడం లేదని ఇప్పటికే కోర్టుకు ప్రభుత్వ తరపు న్యాయవాదులు వివరించారు. ప్రస్తుతం ముందస్తు బెయిల్ దక్కక పోవడంతో ఆయన్ని అరెస్టు చేయడం ఖాయం అన్నది స్పష్టమైంది. ఇదే అదనుగా ఆయన అజ్ఞాతంలోకి వెళ్లి పోయారు. ఆంధ్రప్రదేశ్ లేదా కర్ణాటకలలో ఆయన తలదాచుకుని ఉండ వచ్చు అన్న సమాచారాలు వెలువడ్డాయి. అలాగే ఢిల్లీలో ఆయనకు కావాల్సిన బీజేపీ పెద్దలు సన్నిహితులుగా ఉన్న సమాచారంతో అటు వైపుగా సైతం సీబీసీఐడీ దృష్టి పెట్టింది. నాలుగు ప్రత్యేక బృందాలురంగంలోకి దిగి జగన్ మూర్తి కోసం వేట ముమ్మరం చేశాయి. ఆయన్ని సోమవారం అరెస్టు చేయవచ్చు అన్న సంకేతాల నేపథ్యంలో ఆయన నివాసం పరిసరాలు, ఆయన ప్రాతినిత్యం వహించే నియోజకవర్గం పరిధిలో ముందు జాగ్రత్తలను పోలీసులు విస్తృతం చేశారు.
పోక్సో కేసులో ముగ్గురి అరెస్టు
అన్నానగర్: నైల్లె సమీపంలో గతవారం 9వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం చేసినందుకు పోక్సో చట్టం కింద ముగ్గురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. నైల్లె జిల్లాలోని మనూర్ సమీపంలోని ఒక గ్రామానికి చెందిన 9వ తరగతి విద్యార్థినిని చంపేస్తామని బెదిరించిన అదే ప్రాంతానికి చెందిన కౌసర్ (20), అజార్ మైదీన్ (20), సదాం (20) ఆ పాఠశాల విద్యార్థిని పై సామూహిక అత్యాచారం చేశారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు పాలై పురనగర్ మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ విషయం పై దర్యాప్తు చేసి కౌసర్, అజార్ మైదీన్, సదామ్ అనే ముగ్గురు వ్యక్తులను పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసి పాలయంకోట్టై సెంట్రల్ జైలుకు తరలించారు.
సముద్రంలో ఈదుతూ
రీల్స్ విద్యార్థి మృతి
తిరువొత్తియూరు: సోషల్ మీడియా లైకుల కోసం రీల్స్ వేటలో ఓ విద్యార్థి సముద్రంలో మునిగి న సమయంలో బండ రాయిఢీకొని మృతి చెందిన ఘటన కలకలం రేపింది. వివరాలు.. చైన్నె, ఎన్నూర్ అన్నై శివగామి నగర్కు చెందిన ప్రదీప్ (18)అతను ప్లస్ 2 పూర్తి చేసి కళాశాలలో ఉన్నత చదువులు చదవడానికి సిద్ధమవుతున్నాడు. ఇదిలా ఉండగా, శనివారం సాయంత్రం ప్రదీప్ ఎన్నూర్లోని పెరియకుప్పం బీచ్లో నలుగురు స్నేహితులతో కలిసి సముద్రంలో స్నానం చేస్తున్నాడు. ఆ సమయంలో, ప్రదీప్ సముద్రంలో స్నానం చేస్తూ, ఈత కొడుతున్న వీడియోను రికార్డ్ చేసి సోషల్ నెట్వర్కింగ్ సైట్లో రీల్స్ పోస్ట్ చేయాలని ప్లాన్ చేశాడు. ఆ ప్రకారంగా, ప్రదీప్ సముద్రంలోకి దూకి అలలలో ఈదుకుంటూ, ఒడ్డున ఉన్న తన స్నేహితులను ఈత కొడుతున్న వీడియో తీయమని అడిగాడు. ఆ సమయంలో, ఎదురు చూడని విధంగా పెద్ద అలలో చిక్కుకున్న ప్రదీప్ నీటిలో మునిగిపోయాడు. అదే సమయంలో ఒడ్డున ఉంచిన బండ రాయి ఢీ కొని తల గాయపడటం చూసి అతని స్నేహితులు దిగ్భ్రాంతి చెందారు. అతన్ని రక్షించి చికిత్స కోసం చైన్నెలోని స్టాన్లీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతన్ని పరీక్షించిన వైద్యులు ప్రదీప్ మార్గంమధ్యలోనే చనిపోయాడని గుర్తించారు. ఎన్నూర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.