
నేరస్తులకు స్థావరంగా తమిళనాడు
– బీజేపీ మైనారీటీ విభాగం జాతీయ కార్యదర్శి
వేలూరు ఇబ్రహీం
తిరువళ్లూరు: డీఎంకే అధికారంలోకి వచ్చిన తరువాత తమిళనాడు నేరస్తులు, దొంగలకు స్థావరంగా మారిపోయిందని బీజేపీ మైనారీటి విభాగం జాతీయ కార్యదర్శి వేలూరు ఇబ్రహీం ఆరోపించారు. తిరువళ్లూరు జిల్లా వెంగల్ రామరాజన్కండ్రిగ ప్రాంతానికి చెందిన హరిసతీష్(48). ఇతను బీజేపీ జిల్లా ట్రజరీగా విధులు నిర్వహిస్తున్నారు. పిల్లలు అన్నానగర్లో చదువుతున్న క్రమంలో ప్రస్తుతం అక్కడే నివాసం వుంటున్నాడు. వారానికి ఒకసారి తన సొంత గ్రామానికి రాకపోకలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో గత రెండు రోజుల క్రితం హరిసతీష్ ఇంట్లో చోరీ జరిగింది. దాదాపు 20 సవ ర్ల బంగారునగలు, 40 వేల నగదు, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ సంఘటనపై బాధితుడు పిర్యాదు చేసిన క్రమంలో ఇంత వరకు ఎఫ్ఐఆర్ నమోదు కాఫీని బాధితుడికి ఇవ్వడానికి పోలీసులు నిరాకరించినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే భాదితుడ్ని పరామర్శించిన వేలూరు ఇబ్రహీం వారికి అండగా వుంటామని హమీ ఇచ్చారు. అనంతరం ఏర్పాటు చేసి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.