ఆకట్టుకున్న తిమ్మన పారిజాతాపహరణం | - | Sakshi
Sakshi News home page

ఆకట్టుకున్న తిమ్మన పారిజాతాపహరణం

Jun 30 2025 4:04 AM | Updated on Jun 30 2025 4:04 AM

ఆకట్టుకున్న తిమ్మన పారిజాతాపహరణం

ఆకట్టుకున్న తిమ్మన పారిజాతాపహరణం

కొరుక్కుపేట: తిమ్మన పారిజాతాపహరణం–మానసోల్లాస వ్యాఖ్యానం అనే అంశంపై ఆదివారం జరిగిన ఉపన్యాస కార్యక్రమం ఆధ్యంతం ఆకట్టుకుంది. వేదవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రతినెలా నిర్వహిస్తున్న తరతరాల తెలుగు కవిత ఉపన్యాస ధారావాహికలో 162వ ప్రసంగంగా తిమ్మన పారిజాతాపహరణం – మానసోల్లాస వ్యాఖ్యానంపై ఉపన్యసించేందుకు హైదరాబాద్‌కు చెందిన అన్నమాచార్య వాజ్మయ పరిశోధకులు గంధం బసవ శంకరరావు వక్తగా పాల్గొన్ని ప్రసంగించారు. చైన్నె టీ.నగర్‌లోని ఆంధ్రా క్లబ్‌ కృష్ణాహాలు వేదికగా సాగిన కార్యక్రమానికి తెలుగు సాహితీ ప్రియులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. కార్యదర్శి కందనూరు మధు, అధ్యక్షుడు జేకే రెడ్డి, ఆస్కా మాజీ అధ్యక్షుడు ఎం.ఆదిశేషయ్య పాల్గొని బసవ శంకరరావును సత్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement